క్రికెట్ లో తీవ్ర విషాదం.. బౌలింగ్ చేస్తూ పడిపోయి.. సెకన్లలో అంతులేని లోకాలకు.. 

Published : Feb 27, 2023, 01:07 AM ISTUpdated : Feb 27, 2023, 01:09 AM IST
క్రికెట్ లో తీవ్ర విషాదం.. బౌలింగ్ చేస్తూ పడిపోయి.. సెకన్లలో అంతులేని లోకాలకు.. 

సారాంశం

క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు  గుండెపోటుతో మృతి చెందిన మరో ఘటన గుజరాత్‌లో వెలుగు చూసింది. అహ్మదాబాద్‌లోని జిఎస్‌టి అధికారి బౌలింగ్ చేస్తూ నేలపై పడి, సెకన్లలో మరణించాడు

ఇటీవల దేశంలో గుండెపోటుతో మరణించిన అనేక సంఘటనలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా అహ్మదాబాద్‌లోని భదాజ్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. బౌలింగ్ చేస్తున్న యువ జీఎస్టీ అధికారికి గుండెపోటు వచ్చి మైదానంలో పడిపోయాడు. వెంటనే సహచర క్రికెటర్లు సమీపంలోని సోలా సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆ యువ క్రికెటర్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. 
  
అహ్మదాబాద్‌లోని భదాజ్‌క్రికెట్ స్టేడియంలో సురేంద్రనగర్ జిల్లా పంచాయతీ జట్టు, GST అధికారుల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ సమయంలో, జిఎస్‌టి జట్టు మొదట బ్యాటింగ్ చేసి.. 104 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన  వసంత్ రాథోడ్ అనే యువ GST అధికారి బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. తనదైన బౌలింగ్ తో బ్యాట్స్ మెన్స్ ను కట్టడి చేస్తున్నాడు. కానీ.. ఆ సమయంలో అతను గుండెపోటుకు గురయ్యాడు. దీంతో ఆ బౌలర్ ఒక్కసారిగా మైదానంలో పడిపోయాడు. కాబట్టి మైదానంలో ఉన్న మరొక GST అధికారి, సహచరుడు అతని వద్దకు వెళ్లి  CPR ఇవ్వడానికి ప్రయత్నించారు. ప్రథమ చికిత్స చేసినప్పటికీ వసంత్ రాథోడ్ ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేదు. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్తారు. అతడిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మరణించినట్టు ప్రకటించారు.  

కెమెరాకు చిక్కిన ఘటన

ఈ బాధాకరమైన సంఘటన కెమెరాలో బంధించబడింది. వసంత్ రాథోడ్ బౌలింగ్ చేస్తూ అకస్మాత్తుగా మైదానంలో కూర్చొని లేచినట్లు వీడియోలో చూడవచ్చు. యువ అధికారి మృతి జీఎస్టీ బృందంలో కలకలం సృష్టించింది.  గత ఆదివారం కూడా ఇలాంటి కేసే తెరపైకి వచ్చింది. రాజ్‌కోట్, సూరత్‌లలో క్రికెట్ ఆడిన కొద్దిసేపటికే ఇద్దరు యువకులు గుండెపోటుతో మరణించారు. ఆడుకున్న కొద్దిసేపటికే ఇద్దరికీ ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ చనిపోయారు.

PREV
click me!

Recommended Stories

India Vs China: చైనాకు చుక్కలు చూపించే సత్తా ఉన్న ఏకైక దేశం.. భారత్ పవర్ పై అమెరికా మైండ్ బ్లోయింగ్ స్టేట్‌మెంట్ !
ఇక పెట్రోల్ బండ్లకు కాలం చెల్లినట్లే.. కొత్త పెట్రోల్ బైక్‌ల‌కు నో రిజిస్ట్రేషన్, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం