యూపీలో 'ఎండ ప్రచండం'.. భానుడి ప్రతాపానికి 34 మంది బలి 

Published : Jun 17, 2023, 05:43 AM IST
యూపీలో 'ఎండ ప్రచండం'.. భానుడి ప్రతాపానికి 34 మంది బలి 

సారాంశం

యూపీలోని బల్లియాలో గత రెండు రోజులుగా వడగాడ్పులు తీవ్రంగా వీస్తున్నాయి. ఫలితంగా 34 మంది దుర్మరణం పాలయ్యారు. వేసవి తాపానికి వృద్ధులు తాళలేకపోయారు. చిన్నారులూ విలవిలాడుతున్నారు.

దక్షిణ భారతదేశంలోనే కాదు.. ఉత్తర భారతదేశంలో కూడా భానుడు భగభగమంటున్నాడు. ప్రధానంగా ఉత్తరప్రదేశలో ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరాయి.  ఉదయం 9 గంటల వరకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీనికి వడగాడ్పులు తోడు కావడంతో రాష్ట్రం  నిప్పులకొలిమిలా మారుతోంది.

ఈ తరుణంలో యూపీలోని బల్లియాలోని జిల్లా ఆసుపత్రిలో ఎండ దెబ్బ కారణంగా గత రెండు రోజుల్లో 34 మంది చికిత్స పొందుతూ మరణించారు. ఈ మేరకు ఆసుపత్రి అధికారి సమాచారం అందించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారనీ, జిల్లాలో మండుతున్న ఎండల కారణంగా ప్రజలు రోగాలబారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్నారని బల్లియా చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) డాక్టర్ జయంత్ కుమార్ తెలిపారు. 

ఉత్తరప్రదేశలో గత రెండు రోజుల్లో 34 మంది చనిపోయారు. వీరిలో జూన్ 15న 23 మంది, జూన్ 16న 11 మంది మృతి చెందగా.. మరణించిన వారిలో ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు.వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ, దర్యాప్తు చేస్తుండగా వారందరూ మరణించారని సీఎంవో తెలిపింది. 

వైద్య సిబ్బంది పెంపు

వృద్ధులు ఎండవేడిమికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, చిన్నారులూ విలవిలలాడుతున్నారని తెలిపారు. ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకుని రోగులను, సిబ్బందిని హీట్ స్ట్రోక్ ప్రమాదం నుంచి కాపాడేందుకు జిల్లా ఆస్పత్రిలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సీఎంఎస్) దివాకర్ సింగ్ శుక్రవారం తెలిపారు. అలాగే డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది సంఖ్యను పెంచామని చెప్పారు.

సీఎంవో సూచనలు
 
వేసవిలో ప్రజలు బయటకు వెళ్లవద్దని, ముఖ్యంగా ఎండలో అవసరం లేకుంటే బయటికి వెళ్లవద్దని, బయటకు వెళ్లేటప్పుడు వేడి, ఎండకు గురికాకుండా  జాగ్రత్తలు తీసుకోవాలనీ, నీరు/పానీయాలు పుష్కలంగా తాగాలని CMS ప్రజలకు సూచించింది. హీట్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే గొడుగు, సన్ గ్లాసెస్, స్కార్ఫ్/స్కార్ఫ్ మొదలైన వాటిని వాడాలని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?