ఫేస్ బుక్ ఛాటింగ్ తో.. 17యేళ్ల బాలుడిని పెళ్లాడిన 20 యేళ్ల యువతి.. ట్విస్ట్ ఏంటంటే...

By AN TeluguFirst Published Jun 28, 2021, 1:07 PM IST
Highlights

ఆమెకు 20 యేళ్లు, అతడికి 17 యేళ్లు.. ఇద్దరూ ప్రేమించుకున్నారు. వయసు అడ్డురాలేదు. తనకంటే చిన్నవాడితో స్నేహం కాస్తా ప్రేమగా రూపాంతరం చెందింది. చివరికి ఇంట్లో వాళ్లను ఎదరించి మరీ.. ఓ గుళ్లో పెళ్లి చేసుకున్నారు.

ఆమెకు 20 యేళ్లు, అతడికి 17 యేళ్లు.. ఇద్దరూ ప్రేమించుకున్నారు. వయసు అడ్డురాలేదు. తనకంటే చిన్నవాడితో స్నేహం కాస్తా ప్రేమగా రూపాంతరం చెందింది. చివరికి ఇంట్లో వాళ్లను ఎదరించి మరీ.. ఓ గుళ్లో పెళ్లి చేసుకున్నారు.

అయితే తనకంటే చిన్నవాడిని.. మైనర్ ను ఓ యువతి పెళ్లాడిందన్న వార్త బైటికి తెలియడంతో విషయం కాస్తా పోలీసులకు చేరింది. అంతే, వెంటనే ఎంట్రీ ఇచ్చారు. దీంతో సీన్ రివర్స్ అయ్యింది. మైనర్ ను పెళ్లాడిన యువతి మీదనే కాదు.. ఆ పెళ్లికి హాజరైన వాళ్ల మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక లోని చిక్ మగళూరు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 17యేళ్ల బాలుడు, బెంగళూరుకు చెందిన 20 యేళ్ల యువతితో పరిచయం అయ్యింది. ఆమె బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. రోజూ ఆ బాలుడితో ఆమె చాట్ చేసేది.

వీడియో కాల్స్ మాట్లాడేది. ఈ క్రమంలోనే ఓ రోజు ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని అడిగింది. అప్పటికే యువతితో ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ తో మాయలో పడ్డ ఆ బాలుడు సరేనన్నాడు. అంతే ఇంట్లో వాళ్లకు చెప్పా పెట్టకుండా ఆమె అతడి ఊరికి వచ్చింది. 

ఆ బాలుడి కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా ఆమె అతడిని వెంటబెట్టుకుని ఓ గుడికి వెళ్లింది. ఆ బాలుడి కొందరు స్నేహితులు, బంధువుల సమక్షంలో అతడిని పెళ్లి చేసుకుంది. అయితే ఈ వార్త కాస్తా ఆ గ్రామంలో తెలిసిపోయింది. దీంతో మైనర్ ను ఓ యువతి పెట్టాడిందన్న విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. 

వెంటనే పోలీసులు ఆ గ్రామానికి వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ యువతిని అదుపులోకి తీసుకున్నాం.. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లిని జరిపించిన వారితో పాటు.. ఆ యువతి మీద కూడా కేసు నమోదు చేశాం అని పోలీసులు తెలిపారు. 

 

click me!