జమ్మూలో ఎన్‌కౌంటర్: నలుగురు ఉగ్రవాదుల హతం

Published : Jun 22, 2018, 11:11 AM ISTUpdated : Jun 22, 2018, 12:53 PM IST
జమ్మూలో ఎన్‌కౌంటర్: నలుగురు ఉగ్రవాదుల హతం

సారాంశం

జమ్మూ ఎన్‌కౌంటర్‌లో నలుగురు టెర్రరిస్టుల హతం

శ్రీనగర్:  జమ్మూ కాశ్మీర్‌లో  శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. వీరితో పాటు ఒక పౌరుడు, ఓ పోలీసు అధికారి మరణించారని భద్రతా దళాలు ప్రకటించాయి.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్  జిల్లాలోని ఓ ఇంట్లో  ఉగ్రవాదులు తలదాచుకొన్నారనే సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. 

భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఈ ఘటనలో ఓ జవాన్ కూడ మృతి చెందారని అధికారులు  ప్రకటించారు. జవాన్ తో పాటు మరో సామాన్యుడు కూడ మరణించారని సమాచారం.

ఇంటలిజెన్స్ అధికారుల సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ఇంటిపై దాడికి దిగారు. మృతిచెందిన ఉగ్రవాదులతో పాటు మరో ఉగ్రవాది కూడ ఇంట్లో తలదాచుకొన్నారని అధికారులు అనుమానిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు
IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ