జమ్మూలో ఎన్‌కౌంటర్: నలుగురు ఉగ్రవాదుల హతం

Published : Jun 22, 2018, 11:11 AM ISTUpdated : Jun 22, 2018, 12:53 PM IST
జమ్మూలో ఎన్‌కౌంటర్: నలుగురు ఉగ్రవాదుల హతం

సారాంశం

జమ్మూ ఎన్‌కౌంటర్‌లో నలుగురు టెర్రరిస్టుల హతం

శ్రీనగర్:  జమ్మూ కాశ్మీర్‌లో  శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. వీరితో పాటు ఒక పౌరుడు, ఓ పోలీసు అధికారి మరణించారని భద్రతా దళాలు ప్రకటించాయి.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్  జిల్లాలోని ఓ ఇంట్లో  ఉగ్రవాదులు తలదాచుకొన్నారనే సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. 

భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఈ ఘటనలో ఓ జవాన్ కూడ మృతి చెందారని అధికారులు  ప్రకటించారు. జవాన్ తో పాటు మరో సామాన్యుడు కూడ మరణించారని సమాచారం.

ఇంటలిజెన్స్ అధికారుల సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ఇంటిపై దాడికి దిగారు. మృతిచెందిన ఉగ్రవాదులతో పాటు మరో ఉగ్రవాది కూడ ఇంట్లో తలదాచుకొన్నారని అధికారులు అనుమానిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

ఒక్క మాటతో సగానికి తగ్గిన హాస్పిటల్ బిల్లు.. అసలు ట్రిక్ ఇదే
ఏమిటీ.. తీర్థయాత్రకు వెళితే లక్ష రూపాయలు ఇస్తారా..!