సారీ, ఫాదర్: రైలు ఢీకొట్టి ఇద్దరు బాలికల మృతి

Published : May 28, 2018, 10:21 AM IST
సారీ, ఫాదర్: రైలు ఢీకొట్టి ఇద్దరు బాలికల మృతి

సారాంశం

ఢిల్లీలోని తుగ్లక్ బాద్ రైల్వే ట్రాక్ పై ఇద్దరు బాలికల శవాలను పోలీసులు గుర్తించారు.

న్యూఢిల్లీ: ఢిల్లీలోని తుగ్లక్ బాద్ రైల్వే ట్రాక్ పై ఇద్దరు బాలికల శవాలను పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం 6 గంటలకు వెలుగులోకి వచ్చింది. బాలికలను రైలు ఢీకొట్టింది. 

వెంటనే వారిని ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే బాలికలు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 

సంఘటన స్థలం వద్ద పోలీసులకు ఓ బ్యాగ్ కనిపించింది. అందులో సారీ, ఫాదర్ అని రాసిన నోట్ కనిపించింది. ఇద్దరు బాలికల్లో ఓ బాలిక తల్లి కొన్నేళ్ల క్రితం మరణించింది. దాంతో బాలిక మనస్తాపానికి గురైనట్లు భావిస్తున్నారు. 

బాలికలు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బాలికలకు 12వ తరగతి విద్యార్థినులై ఉంటారా, సిబిఎస్ సీ ఫలితాల పట్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu