ఢిల్లీలో అగ్నిప్రమాదం: 17కి చేరిన మృతుల సంఖ్య

Siva Kodati |  
Published : Feb 12, 2019, 10:12 AM IST
ఢిల్లీలో అగ్నిప్రమాదం: 17కి చేరిన మృతుల సంఖ్య

సారాంశం

దేశరాజధాని ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 17కి చేరింది. కరోల్‌బాగ్‌ ప్రాంతంలోని అర్పిత్ ప్యాలెస్ హోటల్‌లో మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 

దేశరాజధాని ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 17కి చేరింది. కరోల్‌బాగ్‌ ప్రాంతంలోని అర్పిత్ ప్యాలెస్ హోటల్‌లో మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చూస్తుండగానే క్షణాల్లో మంటలు హోటల్ మొత్తం వ్యాపించాయి.

తొలుత మంటల్లో చిక్కుకుని 9 మంది సజీవదహనం కాగా, మరో ముగ్గురు గాయపడ్డారు. అయితే హోటల్ గదుల్లో కొందరు చిక్కుకుపోవడంతో సహాయక బృందాలు వారిని కాపాడటానికి శ్రమించాయి. అయినప్పటికి 8 మంది అగ్గికి ఆహుతయ్యారు. సుమారు 26 ఫైరింజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Modi Speech on Delimitation in Parliament డీ లిమిటేషన్ పైపార్లమెంటులో మోదీ స్పీచ్ | Asianet Telugu
ఆడపిల్లల్ని కూడా వదల్లేదు బైరెడ్డి శబరి స్పీచ్ కి దద్దరిల్లిన పార్లమెంట్| Asianet News Telugu