Bengaluruలో 15 స్కూళ్లకు బాంబు బెదిరింపులు: భయాందోళనలో పేరేంట్స్

Published : Dec 01, 2023, 10:02 AM ISTUpdated : Dec 01, 2023, 10:07 AM IST
Bengaluruలో 15 స్కూళ్లకు బాంబు బెదిరింపులు: భయాందోళనలో పేరేంట్స్

సారాంశం

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో 15 స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో  పేరేంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై పోలీసులు రంగంలోకి దిగారు.


బెంగుళూరు: నగరంలోని  15 స్కూళ్లకు  బాంబు బెదిరింపులు వచ్చాయి.  దీంతో  ఈ స్కూల్లో చదివే విద్యార్థుల పేరేంట్స్ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.  ఈ మెయిల్ ద్వారా  గుర్తు తెలియని వ్యక్తి బాంబు బెదిరింపులకు పాల్పడ్డాడు. నగరంలోని  బసవేశ్వర్ నగర్ నాఫెల్ స్కూల్ తో నగరంలోని పలు స్కూళ్లకు  బాంబు బెదిరింపులు వచ్చాయి. 


 యెలహంకలో ఉన్న స్కూల్ కు బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది.  దీంతో  ఈ స్కూల్ లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్ నుండి తమ పిల్లలను ఇళ్లకు తీసుకు వచ్చేందుకు  ఇంటి నుండి స్కూళ్లకు బయలు దేరారు. నగరంలోని పలు స్కూళ్లకు  బాంబు బెదిరింపు వచ్చినట్టుగా తమ దృష్టికి వచ్చిందని బెంగుళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద్ చెప్పారు.

బెదిరింపు వచ్చిన అన్ని స్కూళ్లలో బాంబు స్క్వాడ్ తనిఖీలు ప్రారంభించిందని ఆయన  చెప్పారు. బసవేశ్వర నగర్ పోలీసులు  బాంబు బెదిరింపు వచ్చిన స్కూళ్లో  బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. గతంలో కూడ ఇదే తరహా  బెదిరింపు కాల్స్ వచ్చిన విషయాన్ని  స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.  బెదిరింపు ఈ మెయిల్ లో  ఒక్క స్కూల్ తో పాటు  పలు స్కూళ్ల పేర్లున్నాయి. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?