ఘోర రైలు ప్రమాదం: 15 మంది వలస కూలీలు మృతి, చెల్లాచెదురుగా శవాలు

Published : May 08, 2020, 08:05 AM ISTUpdated : May 08, 2020, 08:06 AM IST
ఘోర రైలు ప్రమాదం: 15 మంది వలస కూలీలు మృతి, చెల్లాచెదురుగా శవాలు

సారాంశం

మహారాష్ట్రలోని ఔరంగబాదులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి గూడ్స్ రైలు వెళ్లింది. దీంతో 15 మంది వలస కూలీలు మరణించారు.

ముంబై: మహారాష్ట్రలోని ఔరంగాబాదులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది వలస కూలీల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశాయి. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు జల్నా, ఔరంగాబాద్ మధ్య ఈ ప్రమాదం సంభవించింది. 

లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీలు రైలు పట్టాలపై రాత్రి నిద్రించారు. వారిలో పిల్లలు కూడా  ఉన్నారు. వారిపై నుంచి రైలు వెళ్లింది. వారిపై గూడ్స్ రైలు వెళ్లింది. దాంతో ఆ ప్రమాదం జరిగింది. శవాలు సంఘటనా చెల్లాచెదురుగా పడిపోయాయి.

కర్మాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. రైల్వై పోలీసు బలగాలు, పోలీసులు బలగాలు సంఘటనా స్థలానికి బయలుదేరాయి. రైళ్లు రావడం లేదనే ఉద్దేశంంతో వలస కూలీలు రైల్వే ట్రాక్ మీద నిద్రించారు. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu