ఘోర ప్రమాదం.. బస్సుని ఢీకొట్టిన లారీ.. 15మంది మృతి

Published : Dec 05, 2019, 09:39 AM IST
ఘోర ప్రమాదం.. బస్సుని ఢీకొట్టిన లారీ.. 15మంది మృతి

సారాంశం

ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సులోని ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులంతా రెండు వాహనాల మధ్యలో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయారు.

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మినీ బస్సుని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 15మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవాలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సులోని ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులంతా రెండు వాహనాల మధ్యలో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయారు.

అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu