మహారాష్ట్రలో ఘోరం: కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి

Published : Jul 18, 2021, 07:56 AM ISTUpdated : Jul 18, 2021, 08:03 AM IST
మహారాష్ట్రలో ఘోరం: కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి

సారాంశం

మహారాష్ట్రలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి ఓ గోడ కూలడంతో 11 మంది మృత్యువాత పడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ముంబై: మహారాష్ట్రలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి 11 మంది మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన చెంబూరులోని భరత్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. 

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందంలో వెంటనే రంగంలోకి దిగాయి. కొండచరియలు విరిగిపడడంతో గొడ కూలింది. దీంతో ప్రాణనష్టం సంభవించింది.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందంలో వెంటనే రంగంలోకి దిగాయి. కొండచరియలు విరిగిపడడంతో గొడ కూలింది. దీంతో ప్రాణనష్టం సంభవించింది.

భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. సహాయక బృందాలు ఇప్పటి వరకు 15 మందిని రక్షించాయి. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు పంపించారు. 

భారీ వర్షాల వల్ల ముంబైలోని లోతట్టు ప్రాంతాలైన చునభట్టి, సియోన్, దాదర్, గాంధీ మార్కెట్, చెంబూరు, కుర్ల ఎల్బీఎస్ రోడ్లలో భారీగా నీరు ప్రవహిస్తోంది. ప్రవాహంలో కార్లు కూడా కొట్టుకుపోయాయి.

PREV
click me!

Recommended Stories

వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఓటింగ్ ఎలా జరిగింది? | Asianet News Telugu
తమిళనాడు ఎన్నికల్లో కమల్ హాసన్ జోరుగా ప్రచారం| Asianet News Telugu