భక్తులకు శునకం ఆశీర్వాదం.. వైరల్ అవుతున్న వీడియో

By telugu news teamFirst Published Jan 12, 2021, 2:23 PM IST
Highlights

ఓ గుడిలో మాత్రం భక్తులు స్వామి వారి దర్శనం తర్వాత ఓ కుక్క ఆశీర్వాదం తీసుకుంటారు

గుడికి భక్తులు తరచూ వెళుతూనే ఉంటారు. అలా వెళ్లిన భక్తులు దేవుడికి నమస్కారం చేసుకొని.. పూజారుల ఆశ్వీర్వాదం తీసుకుంటారు. అయితే.. ఓ గుడిలో మాత్రం భక్తులు స్వామి వారి దర్శనం తర్వాత ఓ కుక్క ఆశీర్వాదం తీసుకుంటారు. ప్రత్యేకంగా వాళ్లే వెళ్లి అడగక్కర్లేదు. అక్కడికి వెళితే చాలు.. ఆ శునకమే స్వయంగా ఆశీర్వదిస్తుంది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లా సిద్ధతేక్ ప్రాంతంలో ఉన్న సిద్ధివినాయక  ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. ప్రతిరోజు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఈ ఆలయ ప్రాంగణంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. గుడి బయట.. మెట్ల పక్కన కాస్త ఎత్తుగా ఉన్న ప్రాంతంలో ఓ కుక్క కూర్చుని ఉంది. 

ఇక దర్శనం చేసుకుని బయటకు వచ్చిన భక్తులను పిలిచి మరి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడమే కాక ఆశీర్వదించింది. ఈ వింత సంఘటనను కొందరు వీడియో తీసి.. సోషల్‌ మీడియా‌లో షేర్‌ చేయ్యడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇక దీన్ని చూసిన నెటిజనులు ‘ఈ వీడియో చూసి మనసుకు ఎంతో ప్రశాంతత లభించింది.. మంచి మనసుతో ఆశీర్వదిస్తుంది’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.
 

click me!