ఎస్‌ఎస్‌సి ( మల్టీ టాస్కింగ్ స్టాఫ్) 7,099 ఖాళీలను ప్రకటించింది

By Sandra Ashok KumarFirst Published Nov 6, 2019, 3:42 PM IST
Highlights

మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (ఎమ్‌టిఎస్) నియామకాలకు సంబంధించిన ఖాళీ వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) విడుదల చేసింది. వీటికి ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.


న్యూ ఢిల్లీ : మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటిఎస్) నాన్-టెక్నికల్ రిక్రూట్‌మెంట్ ఖాళీ వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) ప్రకటించింది. జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ 'సి' నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ పోస్టులకు నియామకం కోసం మొత్తం 7,099 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. కమిషన్ వివరాలు ప్రాంతం / జోన్ వారీగా విడుదల చేసింది.

also read civil service jobs: సివిల్ సర్వీసెస్ 2019 నోటిఫికేషన్ విడుదల

ఎమ్‌టిఎస్ పోస్టుకు ఎంపిక ప్రక్రియ మొదలైంది. మొదటి పేపర్ లో పొందిన మార్కులను తుది మెరిట్ జాబితాలో పరిగణించబడతాయి. ఎస్‌ఎస్‌సి ఎమ్‌టిఎస్ పేపర్ 1 ఫలితాన్ని నవంబర్ 5 న ప్రకటించారు. రెండవ పేపర్ వ్యాసం మరియు లెటర్ రైటింగ్ టెస్ట్ నవంబర్ 24 న జరుగుతుంది. ఈ  పేపర్ లో ఉత్తీర్ణులు ఐనా వారు అర్హత పొందుతారు.

"పేపర్ 1 లోని  మెరిట్, పేపర్ 2 లో కట్-ఆఫ్ మార్కుల ఆధారంగా, అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారంలో ఇచ్చిన సమాచారం ప్రకారం అర్హత పొందిన వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం షార్ట్ లిస్ట్ చేయబడతారు.

aslo read IBPS JOBS:IBPS రిక్రూట్మెంట్ నోటీసును విడుదల: మొత్తం 1,163 ఖాళీలు

షార్ట్ లిస్ట్  అయిన అర్హత గల అభ్యర్థులు పోస్ట్ నియామకం కోసం తుది ఎంపికకు హరుకావాల్సి ఉంటుంది"అని ఎస్ఎస్సి విడుదల చేసిన నోటీసులో తెలిపారు."తుది ఎంపికపై అభ్యర్థులు సంబంధిత వినియోగదారు మంత్రిత్వ శాఖ / విభాగం / కార్యాలయం కేటాయించిన పోస్టులకు అభ్యర్థులను ధృవీకరించడానికి కేటాయించిన రాష్ట్రం / యుటి యొక్క స్థానిక భాషలో నైపుణ్యాన్ని పొందవలసి ఉంటుంది" అని నోటీసు పేర్కొంది.

click me!