హెచ్‌పీసీఎల్‌‌లో భారీగా ఉద్యోగాలు.. బీఈ/బీటెక్‌ చేసిన వారు ధరఖాస్తు చేసుకోవచ్చు..

By S Ashok KumarFirst Published Mar 6, 2021, 7:27 PM IST
Highlights

హెచ్‌పి‌సి‌ఎల్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనాలు అందించునున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పి‌సి‌ఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనాలు అందించునున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఇంజనీరింగ్ సంబంధింత విభాగంలో (బీటెక్‌/బీఈ) పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఏప్రిల్‌ 15 దరఖాస్తు చేసుకోవడానికి  చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్  https://www.hindustanpetroleum.com/లో చూడవచ్చు.

క్యాటగిరి కేటాయింపు: ఎస్‌సి -20, ఎస్‌టి -18, ఓ‌బి‌సి-49, ఈ‌డబల్యూ‌ఎస్-20, యూ‌ఆర్-93

ఇందులో ఉన్న మొత్తం ఖాళీలు: 200
మెకానికల్‌ ఇంజినీర్‌ - 120
సివిల్‌ ఇంజినీర్‌ - 30
ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ - 25
ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీర్‌ - 25

also read 

విద్యార్హత: గుర్తింపు పొందిన కాలేజీ/యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో నాలుగేళ్ల పాటు ఫుల్‌టైం ఇంజినీరింగ్‌ (బీఈ/బీటెక్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అభ్యర్థుల వయసు 25 ఏళ్లు మించకూడదు.
ఎంపికలు: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్‌ టాస్క్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1180 (రిజర్వేషన్ల వారీగా ఫీజు మినహాయింపు ఉంటుంది)
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 3 మార్చి  2021
దరఖాస్తు  చివరితేది: 15 ఏప్రిల్‌ 2021
అధికారిక వెబ్‌సైట్‌:https://www.hindustanpetroleum.com/

click me!