యు‌పి‌ఎస్‌సి 2020 నోటిఫికేషన్‌ విడుదల.. డిగ్రీ, ఇంజినీరింగ్ అర్హత ఉంటే చాలు..

By Sandra Ashok KumarFirst Published Sep 15, 2020, 3:23 PM IST
Highlights

 వివిధ మంత్రిత్వ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ కమిషన్‌ (యు‌పి‌ఎస్‌సి) నోటిఫికేషన్‌ 2020 విడుదలైంది. వివిధ మంత్రిత్వ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు  నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యింది. అక్టోబర్‌ 1, 2020 చివరి తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు https://www.upsc.gov.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు పొందవచ్చు. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 204 ఖాళీలు ఉన్నాయి.


ఖాళీలు ఉన్న పోస్టుల వివరాలు
లైవ్‌స్టాక్ ఆఫీస‌ర్‌ : 03
స్పెష‌లిస్ట్ గ్రేడ్‌ : 03
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌ : 175

also read 

అసిస్టెంట్ డైరెక్టర్‌ : 25
అసిస్టెంట్ ఇంజినీర్ : 01

అర్హ‌త వివరాలు‌: వివిధ పోస్టులను అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌తో పాటు నిర్దిష్ట అనుభ‌వం ఉండాలి.
ఎంపిక చేసే విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: అక్టోబర్‌ 01, 2020
అధికారిక వెబ్‌సైట్‌:https://www.upsconline.nic.in/
 

click me!