TS EAMCET : ఎంసెట్‌ నోటిఫికేషన్ 2020 విడుదల...వెంటనే అప్లై చేసుకోండీ

By Sandra Ashok KumarFirst Published Feb 22, 2020, 11:35 AM IST
Highlights

తెలంగాణలో ఎంసెట్‌ ఎంట్రన్స్ పరీక్ష నోటిఫికేషన్ ను జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) హైదరాబాద్‌ విడుదల చేసింది. 

ఇంటర్ విద్యార్డుల కోసం తెలంగాణలో ఎంసెట్‌ ఎంట్రన్స్ పరీక్ష నోటిఫికేషన్ ను జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) హైదరాబాద్‌ విడుదల చేసింది. టీఎస్‌ ఎంసెట్‌ (తెలంగాణ స్టేట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ - 2020 రాయలనుకునే వారు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్ పూర్తి చేసిన వారు బి-టెక్ లో చేరాలనుకునే విద్యార్ధులు వెంటనే అప్లై చేసుకోండీ. ఎంట్రన్స్ పరీక్షలో అర్హత పొందిన వారు బి-టెక్ చేయడానికి అర్హులు. 
  
టీఎస్‌ ఎంసెట్‌ (తెలంగాణ స్టేట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ - 2020 వివరాలు

also read చెఫ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం...వెంటనే అప్లై చేసుకోండీ

కోర్సులు: ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీలలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు. 

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్‌ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

ఎంపిక: కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్‌) మార్కులు, ర్యాంకు ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 21 నుంచి మొదలవుతుంది.

also read  సీఎం విదేశీ స్కాలర్‌షిప్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం...వెంటనే అప్లై చేసుకోండీ

చివరి తేదీ: మార్చి 30

ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400 చెల్లించాలి, మిగిలిన వారికి రూ.800 చెల్లిస్తే సరిపోతుంది.

హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ ఏప్రిల్‌ 06 నుంచి 09 వరకు.

ఇంజినీరింగ్‌ పరీక్ష తేదీలు: మే 4, 5, 7 

అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షతేదీలు:   మే 9, 11న పరీక్షలు నిర్వహిస్తారు.

మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌: https://eamcet.tsche.ac.in చూడండి.

click me!