టెక్సాస్ ఘటన మరువకముందే.. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నిందితుడితో సహా ఐదుగురు మృతి...

Published : Jun 02, 2022, 07:56 AM IST
టెక్సాస్ ఘటన మరువకముందే.. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నిందితుడితో సహా ఐదుగురు మృతి...

సారాంశం

టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో ఒక టీనేజర్ కాల్పులు జరిపి 22 మందిని బలి తీసుకున్న ఘటన జరిగిన వారం తరువాత మళ్లీ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. అమెరికాలోని ఓక్లహోమాలో ఆసుపత్రి క్యాంపస్ లో జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు.

అమెరికా : Oklahomaలోని తుల్సాలోని Medical Building‌లో బుధవారం రైఫిల్, హ్యాండ్ గన్ లతో వచ్చిన సాయుధుడైన వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ Shootingల్లో నలుగురు వ్యక్తులు మరణించారు, యునైటెడ్ స్టేట్స్‌లో భయాందోళనలకు గురి చేస్తున్న వరుస సామూహిక కాల్పులలో భాగమేనని పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో జరిగిన ఎదురు కాల్పుల్లో షూటర్ కూడా కాల్చి చంపబడ్డాడు.

"సెయింట్ ఫ్రాన్సిస్ హాస్పిటల్ క్యాంపస్‌లోని నటాలీ బిల్డింగ్‌లో జరిగిన ఈ ఘటనలో షూటర్‌తో సహా ఐదుగురు మరణించారు" అని తుల్సా పోలీసులు తెలిపారు. తుల్సా డిప్యూటీ పోలీసు చీఫ్ జోనాథన్ బ్రూక్స్ సెయింట్ ఫ్రాన్సిస్ హాస్పిటల్ క్యాంపస్ వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ, పోలీసుల ఎదురు కాల్పుల్లో.. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా మరణించాడని తెలిపారు.

బ్రూక్స్ మాట్లాడుతూ, పోలీసులు నిందితుడు ఎవరు అని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారని, అతని వయస్సు 35- 40 మధ్య ఉందని చెబుతున్నారు. కాల్పుల గురించి సమాచారం అందిన మూడు నిమిషాల తర్వాత పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదునిమిషాల్లోపే బాధితులు, అనుమానితుడిని గుర్తించారని చెప్పుకొచ్చారు. నిందితుడు రైఫిల్, హ్యండ్ గన్ లతో ఘటనాస్థలికి వచ్చాడని తెలిపారు. 

"ఈ హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని తుల్సా మేయర్ జి.టి. బైనమ్ అన్నారు. క్యాంపస్‌లోని నటాలీ బిల్డింగ్‌లోని రెండవ అంతస్తులో కాల్పులు జరిగాయి, ఇందులో ఆర్థోపెడిక్ సెంటర్‌తో సహా వైద్యుల కార్యాలయాలు ఉన్నాయి. మరో తుల్సా డిప్యూటీ పోలీస్ చీఫ్ ఎరిక్ డాల్గ్లీష్ మాట్లాడుతూ బాధితుల్లో ఉద్యోగులు, రోగులు కూడా ఉన్నారని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. 

రాజధాని ఓక్లహోమా నగరానికి ఈశాన్యంగా 100 మైళ్ల (160 కి.మీ) దూరంలో ఉన్న దాదాపు 411,000 మంది జనాభా కలిగిన తుల్సాలో ప్రెసిడెంట్ జో బిడెన్‌కు కాల్పుల గురించి వివరించామని, రాష్ట్ర, స్థానిక అధికారులకు మద్దతు ఇచ్చామని వైట్ హౌస్ తెలిపింది. మేలో జరిగిన రెండు సామూహిక కాల్పుల ఘటనల తర్వాత తుల్సా షూటింగ్ అమెరికన్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. తుపాకీ నియంత్రణపై చర్చలు రేకెత్తించాయి. గత వారం, టెక్సాస్‌లోని ఉవాల్డేలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఒక సాయుధుడు 19 మంది పిల్లలను, ఇద్దరు ఉపాధ్యాయులను చంపాడు. మే నెలలో, న్యూయార్క్‌లోని బఫెలోలోని ఒక సూపర్ మార్కెట్‌లో కాల్పులు జరిపి ఓ వ్యక్తి 10 మందిని చంపాడు.

ఇదిలా ఉండగా, మే 25న అమెరికాలోని టెక్సాస్లోని ఒక ఎలిమెంటరీ స్కూల్లో 18 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 19మంది విద్యార్థులతో సహా 21 మంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన విద్యార్థుల వయసు నాలుగు నుంచి 14 ఏళ్ల మధ్య ఉంటుందని అక్కడి అధికారులు తెలిపారు. గత కొన్నేళ్లలో ఇది అత్యంత ఘోరమైన సంఘటన అని ఆ రాష్ట్ర గవర్నర్ గ్రేగ్ అబాట్ వెల్లడించారు. మెక్సికన్ సరిహద్దుల్లోని ఉవాల్డేలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత పోలీసుల కాల్పుల్లో దుండగులు చనిపోయాడు. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.  

దీంతో వెంటనే స్థానిక పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నాయి.  దుండగుడు తన కారును వదిలేసి రోబ్ ఎలిమెంటరీ పాఠశాలలోకి ప్రవేశించాడు అని, తన వద్ద తుపాకీతో పాటు రైఫిల్ కూడా ఉండి ఉండొచ్చని గవర్నర్ తెలిపారు. ఈ పాఠశాలలో మొత్తం 500 మంది కంటే ఎక్కువే విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో  వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. పాఠశాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.  కాల్పుల సమాచారాన్ని అధ్యక్షుడు జో బైడెన్ కు  అధికారులు తెలిపారు. కాల్పులు జరిపింది..స్థానికంగా నివసించే యూఎస్ పౌరుడు సాల్వడార్ రామోస్ అని అనుమానిస్తున్నారు. అతను కూడా పోలీసుల ఎదురు కాల్పుల్లో చనిపోయాడని గవర్నర్ చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే