వాంటెడ్ ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరమ్ జిత్ సింగ్ పంజ్వార్ హతం

Published : May 07, 2023, 12:02 AM IST
వాంటెడ్ ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరమ్ జిత్ సింగ్ పంజ్వార్ హతం

సారాంశం

Paramjit Singh Panjwar: లాహోర్ లో ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరమ్ జిత్ సింగ్ పంజ్వార్ హతమ‌య్యాడు. లాహోర్ లోని జౌహర్ పట్టణంలోని సన్ ఫ్లవర్ సొసైటీలోకి ప్రవేశించిన దుండగులు పలుమార్లు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో ప‌ర‌మ్ జిత్ సింగ్ పంజ్వార్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స‌మాచారం.  

Khalistan Commando Force Chief Paramjit Singh Panjwar: పాకిస్థాన్ లోని లాహోర్ లోని జోహార్ టౌన్ లో శ‌నివారం వాంటెడ్ ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ (కేసీఎఫ్) చీఫ్ పరమ్ జిత్ సింగ్ పంజ్వార్ అలియాస్ మాలిక్ సర్దార్ సింగ్ ను ఇద్దరు గుర్తుతెలియని షూటర్లు హతమార్చారు. జోహార్ టౌన్ లోని సన్ ఫ్లవర్ సొసైటీలోని తన నివాసానికి సమీపంలో ఉదయం 6 గంటలకు మోటారు సైకిల్ పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో నడుచుకుంటూ వెళ్తున్న పంజ్వార్, అతని అంగరక్షకుడు హత్యకు గురయ్యారని స్థానిక మీడియా పేర్కొంది. ఈ కాల్పుల్లో గన్ మెన్ గాయపడ్డాడనీ, అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన‌ట్టు సంబంధిత క‌థ‌నాలు పేర్కొన్నాయి. 

లాహోర్ లోని జౌహర్ పట్టణంలోని సన్ ఫ్లవర్ సొసైటీలోకి ప్రవేశించిన దుండగులు పలుమార్లు కాల్పులు జరిపారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. బుల్లెట్ గాయాలతో పంజ్వర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సంబంధిత వ‌ర్గాలు సైతం పేర్కొన్నాయి. భారత్ లోని పంజాబ్ లోకి డ్రోన్లను ఉపయోగించి మాదకద్రవ్యాలు, ఆయుధాల స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ప‌రమ్ జిత్ సింగ్ పంజ్వార్ త‌రణ్ తరణ్ సమీపంలోని పంజ్వార్ కుగ్రామంలో జన్మించాడు. 1986లో తన బంధువు లభ్ సింగ్ ఒత్తిడితో కేసీఎఫ్ లో చేరిన ఆయన అంతకు ముందు సోహల్ లోని సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులో పనిచేశారు.

1990వ దశకంలో భారత భద్రతా దళాలు లభ్ సింగ్ ను హతమార్చిన తరువాత, పంజ్వార్ కెసిఎఫ్ ను స్వాధీనం చేసుకుని పాకిస్తాన్ కు పారిపోయాడు. పాకిస్థాన్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్న పంజ్వార్ సీమాంతర ఆయుధాల స్మగ్లింగ్, హెరాయిన్ అక్రమ రవాణా ద్వారా నిధులు సంపాదించడం ద్వారా కేసీఎఫ్ ను సజీవంగా ఉంచాడు. పాకిస్తాన్ నిరాకరించినప్పటికీ, పంజ్వార్ లాహోర్ లోనే ఉండిపోయాడు. అయితే, అతని భార్య, పిల్లలు జర్మనీకి వెళ్లారు. అతను మాలిక్ సర్దార్ సింగ్ పేరుతో పాకిస్తాన్ లో నివసిస్తున్నాడు. 90వ దశకానికి ముందే ఆయన భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. 1999 జూన్ 30న చండీగఢ్ లోని పాస్ పోర్టు కార్యాలయం సమీపంలో జరిగిన బాంబు పేలుడును ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ నేత పరమ్ జిత్ సింగ్ పంజ్వార్ నిర్వహించార‌నీ, ఈ పేలుడులో నలుగురు గాయపడగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

PREV
Read more Articles on
click me!