శవాలతో మహిళ వ్యాపారం.. ముక్కలుగా కోసి అమ్మేస్తూ..!

By telugu news teamFirst Published May 3, 2023, 10:17 AM IST
Highlights

ఆమె ఎంతో కాలంగా ఈ వ్యాపారం చేస్తుండగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 

ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్కరు ఒక్కోటి ఎంచుకుంటారు. వాటిలో కొన్ని మంచివీ ఉంటాయి. కొన్ని చెడ్డవీ ఉంటాయి. ఓ మహిళ కూడా ఇలానే డబ్బు సంపాదించుకోవడానికి ఓ మార్గం ఎంచుకుంది. అదే.. శవాలను అమ్మడం. చనిపోయినవారి మృతదేహాలను హాస్పిటల్ లోని మార్చరీలో  భద్రపరుస్తూ ఉంటారు. అలా భద్రపరిచిన శవాలను ఓ మహిళ వ్యాపారం కోసం వాడేసింది. చనిపోయిన వారి శరీరంలోని భాగాలను కట్ చేసి మరీ అమ్మడం గమనార్హం. ఆమె ఎంతో కాలంగా ఈ వ్యాపారం చేస్తుండగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అమెరికాలోని అర్కాన్సాస్ కు చెందిన కాండేస్ స్కాట్ అనే 36ఏళ్ల మహిళ స్థానికంగా ఉన్న ఓ మార్చరీలో పనిచేస్తోంది. కాగా ఆమె 2021లో ఫేస్ బుక్ లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతనితో ఆమె సీక్రెట్ గా ఓ ఒప్పందం చేసుకుంది. మార్చరీలో పడి ఉన్న శవాలను శరీర భాగాలను కట్ చేసి అమ్మేయడం ఆమె చేయాల్సిన పని. ఒప్పందం ప్రకారం మెడికల్ కాలేజీ నుంచి శవాల పుర్రెలు, దంతాలు, మెదడు వంటి అవయవాలను ఆమె అతనికి అమ్మింది. దాదపాు 11వేల డాలర్లకు అమ్మడం గమనార్హం.

ఒక్కసారిగా అంత డబ్బు రావడంతో ఆమె ఆనందం తట్టుకోలేకపోయింది. అప్పటి నుంచి సుమారు తొమ్మిది నెలల పాటు ఆమె మూత్ర పిండాలు, గుండె, ఊపిరితిత్తులు.. ఇలా చాలా శరీర భాగాలను అమ్మడం మొదలుపెట్టింది. చాలా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆమెను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడీయాలో వైరల్ గా మారింది. 

click me!