
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. రష్యా మరింత దూకుడుగా ప్రదర్శిస్తుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. అయినప్పటికీ రష్యా (Russia) ఏమాత్రం పట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్పై (Ukraine) బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు మార్లు ఆ దేశ నేతలు అణుబాంబు దాడులు గురించి ప్రస్తావించడం ఉక్రెయిన్ తో పాటు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, రష్యా బలగాలకు ఉక్రెయిన్ ధీటైన సమాధానంతో ముందుకు సాగుతోంది. అయినప్పటికీ రష్యా బలగాలు ఉక్రెయిన్లోని ప్రధాన ప్రాంతాలను, కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటూ.. ఆ దేశంపై పట్టుసాధిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఉక్రెయిన్ కు ఎంతో కీలకమైన రేపు పట్టణం మరియుపోల్ను (Mariupol) రష్యా (Russia) బలగాలు చుట్టుముట్టాయి. వ్యూహాత్మక ఓడరేవు నగరం ప్రియజోవియా ప్రాంతంలో అజోవ్ సముద్ర ఉత్తర తీరంలో ఉంది. ఉక్రెయిన్లో పదవ-అతిపెద్ద నగరం.. మరియు దొనేత్సక్ ఒబ్లాస్ట్లో రెండవ అతిపెద్ద నగరం. ఈ ఓడరేవు నగరాన్ని స్వాధీనం చేసుకోవడం రష్యా మిలిటరీ చర్యలకు వ్యూహాత్మక ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇది విలీనమైన క్రిమియా నుండి వచ్చే రష్యన్ దళాలతో పాటు డాన్బాస్లోని దళాలకు అనుసంధానిస్తుంది. కాబట్టి మరియుపోల్ను రష్యన్ బలగాలు అదుపులోకి తీసుకోవడంతో ఉక్రెయిన్ (Ukraine) పై దాడులు.. ఆక్రమణ రష్యా (Russia) కు వ్యూహాత్మకంగా ఉంటుంది.
ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులు చేయడం మొదలు పెట్టి పదిరోజులు అవుతోంది. ఉక్రెయిన్ రాజధాని కైవ్ నగరంలో పాటు ఆ దేశంలోని ప్రధాన నగరాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. వ్యూహాత్మకమైన ప్రధాన ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకుంటూ రష్యా బలగాలు దాడులు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఖేర్సన్ నగరంతో అణువిద్యుత్ కేంద్రాలైన చెర్నోబిల్, జపోరిజియా పవర్ ప్లాంట్ను తమ ఆధీనంలో తీసుకున్న రష్యా (Russia).. ప్రస్తుతం కీలకమైన పోర్టు సిటీ మరియుపోల్ను (Mariupol) రష్యా (Russia) బలగాలు చుట్టుముట్టాయని నగర మేయర్ తెలిపారు.
ప్రస్తుతానికి, మేము మానవతా సమస్యలకు పరిష్కారాలను వెతుకుతున్నాము.మారియుపోల్ను దిగ్బంధనం నుండి బయటపడేసేందుకు సాధ్యమైన అన్ని మార్గాలను వెతుకుతున్నామని నగర మేయర్ బాయ్చెంకో (Vadym Boychenko) చెప్పారు. కాల్పుల విరమణ స్థాపన, కీలకమైన మౌలిక సదుపాయాల పునరుద్ధరణ మరియు నగరంలోకి ఆహారం మరియు ఔషధాలను తీసుకురావడానికి మానవతా కారిడార్ను ఏర్పాటు చేయడం తన ప్రధాన ప్రాధాన్యతగా పేర్కొన్నాడు. త్వరలోనే గ్రీన్ కారిడార్ ఏర్పాటు అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.