లోయలో పడిన బస్సు..20మంది మృతి

Published : Mar 10, 2020, 08:32 AM IST
లోయలో పడిన బస్సు..20మంది మృతి

సారాంశం

బస్సు ప్రమాదవశాత్తు పర్వత ప్రాంతం నుంచి లోయలోకి పడిపోయింది.ఈ ఘటనలో 20మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

బస్సు లోయలో పడి 20మంది దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన  పాకిస్థాన్ లో సోమవారం చోటుచేసుకుంది. గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా తెలిపిన వివరాల ప్రకారం... రావల్పిండి నుంచి స్కర్దు ప్రాంతానికి ఓ బస్సు  25మంది ప్రయాణికులతో బయలుదేరింది.

Also Read రైలుని ఢీకొట్టిన బస్సు... 20మంది మృతి...

ఈ క్రమంలో బస్సు ప్రమాదవశాత్తు పర్వత ప్రాంతం నుంచి లోయలోకి పడిపోయింది.ఈ ఘటనలో 20మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

ఇప్పటి వరకు 8మంది మృతదేహాలను వెలికి తీశారు.  సైనిక హెలికాప్టర్ల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ