
ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పంజ్ షేర్లో తాలిబన్లకు రెసిస్టెన్స్ ఫోర్స్కు మధ్య భీకర పోరు కొనసాగుతోంది. అయితే పంజ్షేర్ను ధీనం చేసుకున్నామని తాలిబన్లు చెబుతుంటే.. అది అవాస్తవమని అహ్మద్ మసూద్ అంటున్నారు. ప్రాణాలకు తెగించి అయినా పోరాడతామని చెబుతున్నారు పంజ్ షేర్ వీరులు. అయితే ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అధిపతి హమీద్ పర్యటించడంపై ఆఫ్ఘన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా తాలిబన్లు, పాకిస్తాన్కు వ్యతిరేకంగా మహిళలు సైతం రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఐఎస్ఐ, పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఫ్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తున్నారు. అహ్మద్ మసూద్ నేతృత్వంలోని ప్రతిఘటన దళాలకు మద్దతుగా నిలిచారు. పంజ్ షీర్ కే తమ మద్దతు అని, తమకు స్వేచ్ఛ కావాలని నినాదాలు చేశారు.
Also Read:తాలిబాన్ ప్రభుత్వానికి తుదిమెరుగులు.. కార్యక్రమానికి చైనా, పాక్, రష్యా, ఇరాన్లకు ఆహ్వానం!
‘‘తాలిబన్లకు మరణ శిక్ష.. ఆఫ్ఘనిస్థాన్ జిందాబాద్’’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పాకిస్థాన్ కూ మరణ శిక్ష తప్పదంటూ నినదించారు. తాలిబన్లకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్లందరూ గళం విప్పాల్సిన సమయం వచ్చిందని అహ్మద్ మసూద్ సందేశం ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఆఫ్ఘన్లు ఇలా పదం కదిపి కదం తొక్కారు. విదేశీ అరాచక శక్తులతో తాలిబన్లు చేతులు కలిపారని, దీనిపై దేశంలోని అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములంతా ఏకం కావాలని అహ్మద్ మసూద్ పిలుపునిచ్చారు. కాగా, ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని పాక్ రాయబార కార్యాలయం ముందు కూడా ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు నిరసన ప్రదర్శన చేశారు. 'పాకిస్థాన్, తాలిబన్లకు మరణ శిక్ష' అంటూ నినదించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తాలిబన్లు .. ర్యాలీలు నిర్వహిస్తున్న మహిళలపై కాల్పులు జరిపారు.