ఏడుగురు శిశువులను హత్య చేసిన సీరియల్ కిల్లర్ నర్సుకు జీవిత ఖైదు...

Published : Aug 21, 2023, 10:19 AM IST
ఏడుగురు శిశువులను హత్య చేసిన సీరియల్ కిల్లర్ నర్సుకు జీవిత ఖైదు...

సారాంశం

ఐదుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలను చంపిన కేసులో లూసీ లెట్బీ (33) దోషిగా నిర్ధారించబడింది. ఇటీవలి కాలంలో లండన్ చరిత్రలో చైల్డ్ సీరియల్ కిల్లర్‌గా కలకలం సృష్టించింది.

లండన్: ఏడుగురు నవజాత శిశువులను హత్య చేసి, తన సంరక్షణలో ఉండగానే మరో ఆరుగురిని చంపేందుకు ప్రయత్నించిన బ్రిటిష్ నర్సుకు సోమవారం శిక్ష ఖరారు కానుంది. లూసీ లెట్బీ (33) ఐదుగురు మగశిశువులు, ఇద్దరు ఆడ శిశువులను చంపినందుకు దోషిగా నిర్ధారించబడింది, ఇటీవలి కాలంలో యూకేలో ఇలాంటి చైల్డ్ సీరియల్ కిల్లర్‌గా కలకలం సృష్టించింది. 

జూన్ 2015 నుంచి జూన్ 2016 మధ్య ఇంగ్లాండ్‌లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్‌లోని నియోనాటల్ యూనిట్‌లో వరుస శిశు మరణాలు నమోదు కావడంతో ఆమెను అరెస్టు చేశారు. లెట్బీ నవజాతశిశువులు.. నెలలు నిండకుండానే జన్మించిన శిశువులకు గాలితో ఇంజెక్ట్ చేయడం లేదా పాలు అధికంగా ఇవ్వడం లేదా ఇన్సులిన్‌తో విషపూరితం చేయడం ద్వారా వారిమీద దాడికి పాల్పడిందని ప్రాసిక్యూషన్ తెలిపింది. 

రష్యా కలలు కల్లలు : సాఫ్ట్ ల్యాండింగ్‌లో సమస్య, చంద్రునిపై కూలిపోయిన లూనా-25 .. అందరి చూపు చంద్రయాన్ 3పైనే

ఈ విచారణ అక్టోబరులో ప్రారంభమయ్యింది. ఆ తరువాత మాంచెస్టర్ క్రౌన్ కోర్టులోని జ్యూరీ శుక్రవారం 110 గంటల కంటే ఎక్కువ సేపు విచారించింది. జ్యూరీ లెట్బీకి హత్యాయత్నానికి సంబంధించిన రెండు అభియోగాలను క్లియర్ చేసింది. హత్యాయత్నానికి సంబంధించిన ఆరు ఇతర ఘటనలపై నిర్ణయాలను తీసుకోలేకపోయింది. 

కానీ హత్యకు సంబంధించిన అనేక నేరారోపణలు ఉండడంతో లెట్బీకి ఇక జైలునుంచి విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.  ఆగస్ట్‌లో జ్యూరీ మొదటి నిర్ణయం చెప్పడంతో లెట్బీ కన్నీటి పర్యంతమయ్యింది. తుది తీర్పు సమయంలో ఆమె కోర్టులో లేదు. శిక్ష ప్రకటించే సమయానికి తాను హాజరుకాబోనని చెప్పినట్లు సమాచారం.

ఈ శిక్ష ఖరారు అయిన తరువాత లెట్బీ బాధిత కుటుంబాలు ఓ సంయుక్త ప్రకటన చేశాయి. అందులో "న్యాయం జరిగింది" అయితే "మనమందరం అనుభవించిన విపరీతమైన బాధ ముందు ఇది సరిపోదు’ అని తెలిపారు. లెట్బీ దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న మొదటి పిల్లలు కవలలు. చైల్డ్ ఏ అని పిలవబడే ఒక మగబిడ్డ, జూన్ 2015 ప్రారంభంలో మరణించినప్పుడు కేవలం ఒక రోజు వయస్సులో ఉండగా, అతని అక్క హత్యాయత్నం నుండి బయటపడింది.

జూన్ 2016లో ఇద్దరు సోదరులు ఒకరినొకరు 24 గంటలలోపు మరణించిన తర్వాత, లెట్బీని నియోనాటల్ యూనిట్ నుండి తొలగించి, క్లరికల్ విధుల్లో ఉంచారు. రెండేళ్ల తర్వాత, జూలై 2018లో, ఆమెను మొదటిసారి అరెస్టు చేశారు. నవంబర్ 2020లో ఆమె మూడవ అరెస్టుపై, లెట్బీ అధికారికంగా అభియోగాలు మోపారు. నిర్బంధంలో ఉంచారు.

PREV
click me!

Recommended Stories

Benjamin Netanyahu : ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఏం చదువుకున్నారో తెలుసా?
Iran Israel War : దుబాయ్ లో 19 మంది భారతీయులు అరెస్ట్.. అసలేం జరుగుతోంది?