ఒక వైపు కోవిడ్.. మ‌రోవైపు వైర‌ల్ వ్యాధులు.. చైనాలో మూత‌ప‌డ్డ పాఠ‌శాల‌లు

Published : Feb 23, 2023, 01:47 PM IST
ఒక వైపు కోవిడ్.. మ‌రోవైపు  వైర‌ల్ వ్యాధులు.. చైనాలో మూత‌ప‌డ్డ పాఠ‌శాల‌లు

సారాంశం

Beijing: డిసెంబర్ ప్రారంభంలో క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో విధించిన దాదాపు అన్ని ఆంక్షలను తొలగించడానికి చైనా తీసుకున్న ఊహించని నిర్ణ‌యంతో ప్ర‌పంచంలోని ప‌లు దేశాల్లో మ‌ళ్లీ క‌రోనా వ్యాప్తి మొద‌లైంది. చైనాలో అయితే  దేశంలోని 1.4 బిలియన్ జనాభాలో దాదాపు 90 శాతం మందికి రెండు నెలల కంటే తక్కువ సమయంలోనే కోవిడ్-19 సోకింది.  

Schools closed in China: చైనాలో క‌రోనా వైర‌స్, ఇతర వైరల్ వ్యాధుల వ్యాప్తి మొద‌లైంది. ఈ క్ర‌మంలోనే అప్ర‌మ‌త్త‌మైన అక్క‌డి ప్ర‌భుత్వం.. వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి చైనా వ్యాప్తంగా పలు పాఠశాలలను మూసివేసింది. డిసెంబర్ ప్రారంభంలో క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో విధించిన దాదాపు అన్ని ఆంక్షలను తొలగించడానికి చైనా తీసుకున్న ఊహించని నిర్ణ‌యంతో ప్ర‌పంచంలోని ప‌లు దేశాల్లో మ‌ళ్లీ కోవిడ్-19 వ్యాప్తి మొద‌లైంది. చైనాలో అయితే దేశంలోని 1.4 బిలియన్ జనాభాలో దాదాపు 90 శాతం మందికి రెండు నెలల కంటే తక్కువ సమయంలోనే కోవిడ్-19 సోకింది. ప్ర‌స్తుతం నిత్యం ప‌దివేల‌కు పైగా కోవిడ్ కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని స‌మాచారం. 

మహమ్మారి ఆంక్షలను సడలించిన తరువాత దేశంలో ఇతర వైర‌ల్ వ్యాధులు సైతం వ్యాప్తి చెంద‌డం మొద‌లైంది. ప్ర‌స్తుతం ఫ్లూ నుండి నోరోవైరస్ వరకు,  కోవిడ్-19 స‌హా ఇతర వ్యాధికారకాల వ్యాప్తిని నిరోధించడానికి చైనా అంతటా అనేక పాఠశాలలు ఈ వారం ప్రారంభం నుంచి మూసివేసిన‌ట్టు ఆ దేశ మీడియా పేర్కొంది. అలాగు, వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామనీ, ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. 

తూర్పు ఇ-కామర్స్ హబ్ హాంగ్‌జౌలో గత వారాంతంలో ఒకే తరగతి గదిలోని పది మంది ద్వితీయ శ్రేణి విద్యార్థులకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ కావడంతో స్థానిక విద్యాశాఖ అధికారులు సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు వారి తరగతులను నిలిపివేశారు. విద్యార్థులకు తొలిసారి కరోనా సోకి ఉండొచ్చని అధికారులు తెలిపారు. అలాగే, షాంఘై ప్రాథమిక పాఠశాల తరగతిలో వ్యక్తిగత బోధనను నిలిపివేసింది. ఇక్కడ నలుగురు విద్యార్థులకు ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది.  పాఠ‌శాల‌లోని  ఇతరులకు కూడా ఇలాంటి లక్షణాలు కనిపించాయి. జెజియాంగ్ ప్రావిన్స్, చైనా రాజధాని బీజింగ్, సమీప నగరం టియాంజిన్ లోని ప‌లు పాఠశాలల్లో ఫ్లూ కేసులు న‌మోద‌య్యాయి. ప‌లువురు విద్యార్థుల‌కు కోవిడ్ పాజిటివ్ గా గుర్తించారు. 

చైనా కోవిడ్ నిబంధనలను సడలించిన తరువాత ప్రపంచవ్యాప్తంగా కనిపించిన దానికి సమాంతరంగా తాజా కేసుల పెరుగుదలలు న‌మోద‌య్యాయి.  కోవిడ్, ఇన్ఫ్లుఎంజాల తాకిడిగా పిలువబడే "ట్విన్డెమిక్" చైనాలో మరింత ఆందోళ‌న‌ను పెంచుతోంద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ క్ర‌మంలోనే అధికారులు పాఠ‌శాల‌ల‌ను మూసివేస్తున్నారు. ఆన్ లైన్ బోధ‌న కొన‌సాగించ‌నున్న‌ట్టు తెలిపారు. ఈ నెల ప్రారంభం నుంచి ఫ్లూ, నోరోవైరస్ వ్యాప్తిని చూస్తున్నామని బీజింగ్ సీడీసీ బుధవారం తెలిపింది. ఈ కేసులు ఎక్కువగా పాఠశాలలు, కిండర్ గార్టెన్‌లలో న‌మోద‌వుతున్నాయ‌ని పేర్కొంది. మహమ్మారికి ముందు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఇన్ఫ్లుఎంజా కేసులు కూడా పెరుగుతున్నాయి. సీడీసీ డేటా ప్రకారం, ఫిబ్రవరి 12 తో ముగిసిన వారంలో చైనా ఫ్లూ పాజిటివిటీ రేటు 0.7 శాతం నుండి 3.4 శాతానికి పెరిగింది. జ్వరం, వాంతులు, విరేచనాలకు కారణమయ్యే నోరోవైరస్ వ్యాప్తి పెరుగుతున్న‌ద‌నీ, ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆ దేశ చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెచ్చరించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే