ప్రశ్న ఏదైనా జవాబు ఒక్కటే.. ‘ఇండియా’’ , సిడ్నీ ఈవెంట్‌లో ప్రవాసుల్లో జోష్ నింపిన నరేంద్ర మోడీ

Siva Kodati |  
Published : May 23, 2023, 10:31 PM IST
ప్రశ్న ఏదైనా జవాబు ఒక్కటే.. ‘ఇండియా’’ , సిడ్నీ ఈవెంట్‌లో ప్రవాసుల్లో జోష్ నింపిన నరేంద్ర మోడీ

సారాంశం

కామన్‌వెల్త్, క్రికెట్, కర్రీ  అనే త్రీ సీ లు భారత్-ఆస్ట్రేలియా సంబంధాలను ప్రభావితం చేస్తాయన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. సిడ్నీలో ప్రవాస భారతీయులు నిర్వహించిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయుల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ అద్భుతమైన స్పందనను అందుకున్నారు. 20,000 సామర్ధ్యం వున్న ఖుడోస్ బ్యాంక్ ఎరీనాకు తరలివచ్చిన వేలాది మంది భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోడీ ఇలా అన్నారు. ‘‘కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన దేశం ఏది అని అడిగారు. దీనికి ప్రవాసులు ఇండియా అని బిగ్గరగా అరిచారు. 

ఆ వెంటనే ‘‘ ఈరోజు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్థ ఏది’’ అని మళ్లీ అడిగారు మోడీ. దీనికి ఇండియా అని అదే స్థాయిలో స్పందన వచ్చింది. అలాగే .. ‘‘ ఆర్ధిక సంక్షోభానికి ఎదురు నిలిచిన ఒకే ఒక్క దేశంగ ప్రపంచ బ్యాంక్ పేర్కొన్నది ఎవరిని’’ అని మోడీ ప్రశ్నించారు. దీనికి మళ్లీ ఇండియా అని ధ్వనించింది. 

భారత్ - ఆస్ట్రేలియాల మధ్య బలమైన బంధానికి అసలైన పునాదులు భారతీయ ప్రవాసుని మోడీ వ్యాఖ్యానించగానే స్టేడియం మొత్తం మోడీ మోడీ నినాదాలతో మారుమోగిపోయింది. ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయుల సహకారాన్ని ప్రశంసించిన ఆయన.. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఎన్ఆర్ఐలు కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. భారతదేశం, ఆస్ట్రేలియాలు కేవలం భౌగోళికంగానే దూరంగా వున్నాయని.. కానీ హిందూ మహాసముద్రం ఇద్దరిని కలుపుతోందన్నారు. రెండు దేశాలు ఎంత భిన్నవమైనప్పటికీ.. పలు స్థాయిలో అనుసంధానించబడి వున్నాయని మోడీ పేర్కొన్నారు. భారత్ ఆస్ట్రేలియా బంధాలను 3 సీలు ప్రభావితం చేస్తాయని.. అవి కామన్‌వెల్త్, క్రికెట్, కర్రీ అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

భారత్ - ఆస్ట్రేలియాను కలిపి వుంచే మరో బంధం యోగా అన్నారు . ఎనర్జీ, ఎకానమీ, ఎడ్యుకేషన్ కూడా మన రెండు దేశాలను ఏకం చేస్తున్నాయని మోడీ చెప్పారు. టర్కీలో భూకంపం వస్తే భారత్ అండగా నిలబడిందని ఆయన గుర్తుచేశారు. భారత్- ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయని ప్రధాని తెలిపారు. ఒక్క క్లిక్‌తో డీబీటీ సాధ్యమైందన్నారు. పర్యావరణ పరిరక్షణకు సౌర విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నామని మోడీ చెప్పారు. రెండు దేశాల మధ్య వలసల ఒప్పందం జరిగిందని.. బ్రిస్బేన్‌లో త్వరలోనే భారత కాన్సులేట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఆపద వున్న భారత్ స్పందిస్తోందని.. అందుకే ప్రస్తుతం భారత్‌ను విశ్వగురు అంటున్నారని మోడీ పేర్కొన్నారు. 

వలసల ఒప్పందం వల్ల ఇరుదేశాల విద్యార్ధులకు ఎంతో ప్రయోజనకరమన్నారు. కరోనా సమయంలో భారత్‌లో అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగిందని మోడీ గుర్తుచేశారు. తనతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వసుదైక కుటుంబం అన్నదే భారత్ నినాదమన్నారు. రెండు దేశాల మధ్య నమ్మకమే ప్రధాన వారధి అని మోడీ పేర్కొన్నారు. అలాగే ఇరు దేశాల మధ్య మరిన్ని విమాన సర్వీసులను ఏర్పాటు చేస్తామని ప్రధాని తెలిపారు. 

ఆస్ట్రేలియా వాసులు సహృదయులు, విశాల హృదయులన్నారు. భారతీయ భాషలన్నీ ఆస్ట్రేలియాలో ప్రముఖంగా వినిపిస్తాయని మోడీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని అనేక ప్రాంతాలు భారతీయులకు ప్రత్యేకమైనవని మోడీ తెలిపారు. ప్రముఖ భారతీయ వంటకాలన్నీ ఆస్ట్రేలియాలో లభిస్తాయని ప్రధాని చెప్పారు. ఆస్ట్రేలియా ప్రధానికి ఇక్కడి జైపూర్ జిలేబీలను రుచి చూపిస్తానని మోడీ తెలిపారు. సిడ్నీలో లక్నో పేరుతో ఓ ప్రత్యేక ప్రాంతం వుందన్నారు. సిడ్నీ ఓపెరా హౌస్‌పై భారత జెండా కనిపించడం సంతోషంగా వుందని మోడీ అన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే