పశ్చిమ పనామాలో రోడ్డు ప్రమాదం: 39 మంది మృతి

Published : Feb 16, 2023, 09:22 AM ISTUpdated : Feb 16, 2023, 09:56 AM IST
పశ్చిమ పనామాలో  రోడ్డు ప్రమాదం: 39 మంది మృతి

సారాంశం

పశ్చిమ పనామాలో  జరిగిన రోడ్డు ప్రమాదంలో  39 మంది మృతి చెందారు.  మరో  20 మంది  ఆసుపత్రిలో  గాయాలతో  చికిత్స  పొందుతున్నారు.  

వాషింగ్టన్: పశ్చిమ పనామాలో  వలసదారులతో  వెళ్తున్న బస్సు  ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో  39 మంది మృతి చెందారు.  అమెరికాకు  వెళ్తున్న  సమయంలో  ఈ ప్రమాదం  జరిగింది. ప్రమాదం  జరిగిన సమయంలో  66 మంది  ప్రయాణీకులున్నారు.  ఈ ప్రమాదంలో  39 మంది  మరణించారు.  మరో  20 మంది ప్రస్తుతం  ఆసుపత్రిలో  చికిత్స  పొందుతున్నారని  అధికారులు తెలిపారు. 

 60 మంది  ప్రయాణీకులతో  వెళ్తున్న  సబ్సు  ప్రమాదవశాత్తు  కొండపైనుండి పడడంతో  ఈ ప్రమాదం  జరిగింది. ఈ ప్రమాదం  సెంట్రల్ అమెరిలో  అత్యంత  ఘోరమైన  ప్రమాదంగా   అధికారులు చెబుతున్నారు. బస్సు  కోస్టారికా  సరిహద్దులో ఉన్న పశ్చిమ తీర ప్రాంతంలో  ఉన్న  చిరికి వైపు వెళ్తున్న  సమయంలో ప్రమాదం జరిగిందని  అధికారులు  తెలిపారు.

బస్సును  ఇద్దరు లైసెన్స్ ఉన్న డ్రైవర్లు నడిపారు.  ఈ ఘటనలో  ఒక డ్రైవర్ మృతి చెందారు. బస్సులో  ఉన్నవారిలో  22 మంది  ఈక్వెడార్ కు చెందినవారున్నారని  పనామాలోని  ఈక్వెడార్ రాయబార కార్యాలయం తెలిపింది.  మరో వైపు  ఈ బస్సులో ప్రయాణీస్తున్నవారిలో  క్యూబా ప్రజలు కూడా  ఉన్నారని క్యూబా  విదేశాంగ శాఖ ప్రకటించింది.  ఈ బస్సు ప్రమాదంపై  దర్యాప్తు చేస్తున్నట్టుగా  అధికారులు ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే