లావుగా ఉన్నారు.. విమానంలోకి నో ఎంట్రీ... 140మంది సిబ్బందికి షాకిచ్చిన ఎయిర్ లైన్స్.. !!

By AN TeluguFirst Published Jun 28, 2021, 9:33 AM IST
Highlights

లావుగా ఉన్నారన్న కారణంగా 140మంది విమాన సిబ్బందిని విమానాలు ఎక్కకుండా నిషేధం విధించారు. ఈ ఘటన పొరుగు దేశమైన పాకిస్తాన్ లో వెలుగు చూసింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)లో ఉద్యోగాలు చేస్తున్న సిబ్బందిలో కొందరు అధిక బరువు ఉన్నారట. 

లావుగా ఉన్నారన్న కారణంగా 140మంది విమాన సిబ్బందిని విమానాలు ఎక్కకుండా నిషేధం విధించారు. ఈ ఘటన పొరుగు దేశమైన పాకిస్తాన్ లో వెలుగు చూసింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)లో ఉద్యోగాలు చేస్తున్న సిబ్బందిలో కొందరు అధిక బరువు ఉన్నారట. 

ఇలా అధిక బరువు న్న వాళ్లెవరూ విమానం ఎక్కకుండా నిషేధిస్తూ పీఐఏ నిర్ణయం తీసుకుంది. జూలై నెలకు సంబంధించిన ఫ్లైట్స్ డ్యూటీ రోస్టర్ లో ీళ్ల పేర్లు లేవు. అలాగే పదోన్నతుల జాబితాలో కూడా వీళ్ల పేర్లు తొలగించారట. 

అయితే ఈ కఠిన నిర్ణయం సడెన్ గా తీసుకోలేదని పీఐఏ ప్రతినిధులు తెలిపారు. ఇంతకు ముందు పలుమార్లు ఈ అధిక బరువున్న సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశామని, అయినా ఎటువంటి మార్పూ రాకపోవడంతోనే కఠిన నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 

click me!