
ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్న omicron వేరియంట్ భౌగోళిక ముప్పుగా పరిణమిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గతంలో బయటపడ్డ delta Variant కంటే వేగంగా వ్యాపిస్తూ ఇప్పటికే అనేక దేశాలకు పాకింది. కానీ, ఇప్పటికీ వ్యాధి తీవ్రత, లక్షణాలపై స్పష్టమైన సమాచారం మాత్రం రావట్లేదు. అయితే ఒమిక్రాన్ సోకిన బాధితుల్లో డెల్టా కంటే భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయి అని South Africaకు చెందిన ఓ డాక్టర్ వెల్లడించారు. ఈ వేరియంట్ బారిన పడిన కొందరు విపరీతమైన Sweatతో బాధ పడుతున్నారని అన్నారు.
‘ఒమిక్రాన్ బారినపడిన వారిలో భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే అవి స్వల్పంగానే ఉన్నాయి. Covid 19 సాధారణ లక్షణాలు అయిన దగ్గు, తరచూ ముక్కు కారడం, గొంతు నొప్పి, తీవ్రమైన జ్వరం వంటివి లేవు కొత్త వేరియంట్ బాధితుల్లో లేవు. ఒమిక్రాన్ సోకిన వారు ఎక్కువగా తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, స్వల్ప జ్వరం, అలసట, గొంతులో దురదతో బాధ పడుతున్నారు అని డాక్టర్ ఏంజెలిక్ కాట్జీ ఓ అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. టీకాలు వేసుకొని వారిలో తలనొప్పి, ఒళ్లు నొప్పులు విపరీతంగా ఉంటుందని చెప్పారు.
కానీ, కొందరు బాధితుల్లో మాత్రం అసాధారణ లక్షణాలు కనిపిస్తున్నాయని ఏంజెలిక్ అన్నారు. అవి డెల్టా కంటే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి అన్నారు. ‘ఈ వేరియంట్ సోకిన బాధితులకు అలసట, బలహీనతతో పాటు రాత్రిపూట విపరీతమైన చెమటలు పడుతున్నాయి. ఎంతలా అంటే ఈ చెమట కారణంగా వారి దుస్తులు, బెడ్ కూడా తడిసి పోయినట్లు వారు చెబుతున్నారు. చాలామందిలో ఈ లక్షణం కనిపిస్తుంది’ అని వైద్యులు వెల్లడించారు.
ఒమిక్రాన్ వేరియంట్ తో గొంతు గరగర కూడా ఎక్కువగా ఉంటుంది అన్నారు. అయితే డెల్టా సోకిన వారు వాసన కోల్పోగా.. ఒమిక్రాన్ సోకిన బాధితుల్లో ఆ లక్షణం కన్పించట్లేదని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ తొలిసారిగా దక్షిణాఫ్రికాలో బయటపడిన విషయం తెలిసిందే. ఈ వేరియంట్ బాధితులకు చికిత్స అందిస్తున్న వారిలో డాక్టర్ ఏంజెలిక్ కూడా ఒకరు. తన వద్దకు వస్తున్న పేషంట్ల లక్షణాలను బట్టి ఈ నిర్ధారణకు వచ్చినట్లు ఆ డాక్టర్ తెలిపారు. అయితే మందులతో ఈ వేరియంట్ నుంచి కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ లక్షణాలు కనిపించినవారు వెంటనే కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి అని ఆమె ఈ సందర్భంగా సూచించారు.
ఇదిలా ఉండగా, Chinaలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. టియాంజిన్ నగరంలో omicron కేసు నమోదైనట్టుగా చైనా అధికారులు ప్రకటించారు. డిసెంబర్ 9న విదేశాల నుండి నగరానికి వచ్చిన ప్రయాణీకుడిలో ఈ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా గుర్తించినట్టుగా చైనా అధికారిక మీడియా ప్రకటించింది. ఒమిక్రాన్ సోకిన రోగికి ఆసుప్రతిలో చికిత్స అందిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు.తూర్పు చైనా పారిశ్రామిక పవర్ హౌస్ ప్రావిన్స్ జెజియాంగ్ లో కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయి. వారంలో 190 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఫ్యాక్టరీని మూసివేశారు అధికారులు. ఇదిలా ఉంటే britain లో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ తో సోమవారం నాడు ఒక్కరు మరణించారు. యూకేలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకుగాను బూస్టర్ డోసులు వేసుకోవాలని బ్రిటన్ సర్కార్ ప్రజలను కోరింది.