ఆ కంపెనీల టీకా తీసుకున్న ప్రయాణికుల విషయంలో.. సౌదీ కీలక నిర్ణయం..!

Published : Jun 02, 2021, 11:13 AM IST
ఆ కంపెనీల టీకా తీసుకున్న ప్రయాణికుల విషయంలో.. సౌదీ కీలక నిర్ణయం..!

సారాంశం

వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికుల విషయంలో గల్ఫ్ దేశం సౌదీ అరేబియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. టీకా వేయించుకున్న ప్రయాణికులకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జీఏసీఏ) ప్రకటించింది.

వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికుల విషయంలో గల్ఫ్ దేశం సౌదీ అరేబియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. టీకా వేయించుకున్న ప్రయాణికులకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జీఏసీఏ) ప్రకటించింది.

అయితే, స్వదేశంలో వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నట్లు జారీ చేసిన సర్ఠిఫికేట్ చూపించడం తప్పనిసరి అని జీఏసీఏ పేర్కొంది. అలాగే ఫైజర్-బయోఎన్ టెక్, మోడెర్నా, ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకా తీసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ఇక వ్యాక్సిన్ వేయించుకోని విదేశీ ప్రయాణికులకు విధించిన ఏడు రోజు క్వారంటైన్ నిబంధనలో ఎలాంటి మార్పు లేదని ఈ సందర్భంగా జీఏసీఏ వెల్లడించింది. 

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ