నవాజ్ షరీఫ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా

Published : Dec 24, 2018, 03:42 PM IST
నవాజ్ షరీఫ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా

సారాంశం

పాక్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు  కోర్టు సోమవారం నాడు ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది.

ఇస్లామాబాద్: పాక్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు  కోర్టు సోమవారం నాడు ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది.

అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌ను కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో నవాజ్ షరీఫ్‌కు  జైలు శిక్షతో పాటు 25 మిలియన్ డాలర్ల జరిమానాను విధించింది కోర్టు.

ఈ కేసుకు సంబంధించి గత బుధవారం నాడు కొన్ని డాక్యుమెంట్లను సమర్పించేందుకు షరీఫ్ న్యాయవాది కోర్టును కోరారు. అయితే  ఇందు కోసం కనీసం వారం రోజుల పాటు సమయాన్ని నవాజ్ షరీఫ్ తరపు న్యాయవాది కోర్టును కోరారు.కానీ నవాజ్ షరీఫ్ తరపు న్యాయవాది అభ్యర్థననను కోర్టు  తోసిపుచ్చింది.

PREV
click me!

Recommended Stories

Modi Trump: 16 నెల‌ల త‌ర్వాత తొలిసారి క‌లిసిన మోదీ, ట్రంప్‌.. అంతా సెట్ అయిన‌ట్లేనా.?
Richest Person: ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. 174 దేశాల జీడీపీ కంటే ఎక్కువ సంపద