బ్రిటన్ రాజు ఛార్లెస్ దంపతులమీదికి గుడ్లు విసిరిన నిరసనకారుడు.. అరెస్ట్...

Published : Nov 10, 2022, 08:00 AM IST
బ్రిటన్ రాజు ఛార్లెస్ దంపతులమీదికి గుడ్లు విసిరిన నిరసనకారుడు.. అరెస్ట్...

సారాంశం

బ్రిటన్ రాజు మీద గుడ్లతో దాడిచేశాడో నిరసనకారుడు. దీంతో అప్పమత్తమైన పోలీసులు వెంటనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.  

లండన్ : బ్రిటన్ రాజు ఛార్లెస్-3 దంపతులకు చేదు అనుభవం ఎదురయింది. ఉత్తర ఇంగ్లాండ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చార్లెస్ దంపతులపై ఓ వ్యక్తి  గుడ్లతో దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసే రాజు ఛార్లెస్-3.. ఈ సారి మాత్రం తదేకంగా చూస్తూ ఉండిపోయారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

ఇంగ్లాండ్ లోని యార్క్ నగరంలో జరిగిన ఓ సంప్రదాయ వేడుకలో  రాజు ఛార్లెస్-3, సతీమణి కెమిల్లాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేడుకకు హాజరైన పౌరులతో కరచాలనం చేస్తూ,  వారిని పలకరిస్తూ ముందుకు సాగారు. అదే సమయంలో జనసమూహంలో ఉన్న ఓ వ్యక్తి  రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఛార్లెస్ పై  గుడ్లు విసిరాడు. ఊహించని పరిణామంతో దంపతులిద్దరూ కొద్దిసేపు అక్కడే నిలబడిపోయారు. 

దారుణం.. పాకిస్థాన్ లో పోలీసు స్టేషన్ పై తాలిబన్ల దాడి.. వాహనానికి నిప్పు పెట్టి, ఇద్దరు పోలీసుల హత్య..

వెంటనే అప్రమత్తమైన పోలీసులు  నిరసనకారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్ ను పాలించిన క్వీన్ ఎలిజబెత్ 2 ఈ ఏడాది సెప్టెంబర్లో మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్రిటన్ నూతన రాజుగా ఛార్లెస్-3 బాధ్యతలు చేపట్టారు. రాజు హోదాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నచార్లెస్కు ఇంగ్లాండ్లో ఇలా ఊహించని అనుభవం ఎదురైంది.


 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?