
పాకిస్థాన్ లో దారుణం జరిగింగి. పోలీసు స్థావరంపై తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేశారు. అనంతరం ఇద్దరు పోలీసులు హతమార్చారు. ఈ ఘటన ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని దిగువ వజీరిస్తాన్ జిల్లాలో జరిగింది. ఈ దాడిలో మరో ఇద్దరు పోలీసులకు కూడా తీవ్ర గాయాలు అయ్యారు. వారు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ఈ దాడి సందర్భంగా ఇద్దరు పోలీసులను చంపడంతో పాటు స్టేషన్ లో ఉన్న ఆయుధాలను కూడా తాలిబన్లు ఎత్తుకెళ్లారు. అలాగే అక్కడే ఉన్న వాహనాన్ని కూడా ఎత్తుకెళ్లారు. అయితే ఈ దాడికి పాల్పడింది తామే, దీనికి పూర్తి బాధ్యత తమదే అని ఉగ్రవాద సంస్థ టీటీపీ ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.