కజకిస్తాన్‌లో వరుస పేలుళ్లు.. 9 మంది మృతి, 80 మందికిపైగా గాయాలు

By Siva KodatiFirst Published Aug 27, 2021, 3:37 PM IST
Highlights

కజికిస్తాన్‌లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. మిలటరీ ప్రాంతంలో జరిగిన ఈ విస్ఫోటనంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 80 మంది తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది

ఆఫ్ఘనిస్తాన్‌కు అత్యంత సమీపంలో వుండే కజికిస్తాన్‌లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. మిలటరీ ప్రాంతంలో జరిగిన ఈ విస్ఫోటనంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 80 మంది తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. తారాజ్ సిటీలో ఈ  పేలుడు చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. పేలుళ్ల తీవ్రత నేపథ్యంలో సమీపంలోని గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. పేలుళ్ల తీవ్రత కారణంగా అటుగా వెళ్లే రోడ్లు, రైల్వే మార్గాలను మూసివేశారు అధికారులు. 

click me!