ఇండోనేషియాలో విమానం మిస్సింగ్: ఆ 62 మంది జలసమాధి..?

Siva Kodati |  
Published : Jan 09, 2021, 07:39 PM ISTUpdated : Jan 09, 2021, 11:49 PM IST
ఇండోనేషియాలో విమానం మిస్సింగ్: ఆ 62 మంది జలసమాధి..?

సారాంశం

ఇండోనేషియాలో ఎయిర్‌ బోయింగ్‌-737 శ్రీ విజయ విమానం అదృశ్యం విషాదాంతమైనట్లుగా తెలుస్తోంది. ఫ్లైట్ అదృశ్యమైందన్న సమాచారంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలకు సముద్రంలో విమాన శకలాలు కనిపించినట్లుగా వార్తలు వస్తున్నాయి

ఇండోనేషియాలో ఎయిర్‌ బోయింగ్‌-737 శ్రీ విజయ విమానం అదృశ్యం విషాదాంతమైనట్లుగా తెలుస్తోంది. ఫ్లైట్ అదృశ్యమైందన్న సమాచారంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలకు సముద్రంలో విమాన శకలాలు కనిపించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

జావా సముద్రంలో విమాన శకలాలు గుర్తించినట్లుగా ప్రచారం జరుగుతోంది. జకార్తా నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల తర్వాత విమానం సముద్రంలో కూలిపోయినట్టు తెలుస్తోంది.

మరోవైపు విమాన శకలాలు కనపించినట్లుగా వార్తలు రావడంతో తమ వారి క్షేమ సమాచారం కోసం ఆశలు పెట్టుకున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

56 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కలిపి మొత్తం 62 మంది ప్రయాణికులతో జకార్తా నుంచి బయలుదేరిన తరువాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో ఆ విమానం సంబంధాలు కోల్పోయాయని అధికారులు తెలిపారు.

రాడార్ డేటాబాక్స్ ప్రకారం మధ్యాహ్నం 1.56 గంటలకు జకార్తా నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.40 గంటలకు కంట్రోల్ టవర్‌తో పూర్తిగా సంబంధాలు కోల్పోయిందని చెప్పారు. ఈ ఘటనపై నేషనల్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఏజెన్సీ, జాతీయ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ కమిటీ దర్యాప్తు మొదలుపెట్టింది.

సహాయ అవసరాల కోసం జకార్తా సమీపంలోని తంగేరాంగ్‌లోని సూకర్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు అధికారులు. కాగా, అదృశ్యమైన స‌మ‌యంలో ఫ్లైట్ భూమికి 10 వేల అడుగుల ఎత్తులో ఉంద‌ని వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే