ఇండోనేషియాలో సునామీ...62 మంది మృతి

Published : Dec 23, 2018, 11:05 AM IST
ఇండోనేషియాలో సునామీ...62 మంది మృతి

సారాంశం

దీవుల సముదాయమైన ఇండోనేషియాను మరోసారి సునామీ అతలాకుతలం చేసింది. శనివారం అర్థరాత్రి సముద్ర గర్భంలో సంభవించిన భూకంపం సముద్రాన్ని అల్లకల్లోలంగా మార్చి తీర ప్రాంతాలను ముంచెత్తింది. ఈ సునామీ దాటికి దాదాపు 62 మంది మృతిచెందగా, మరో 600 మంది వరకు తీవ్ర గాయాలపాలైనట్లు ఇండోనేషియా విపత్తు నివారణ అధికారులు వెల్లడించారు. 

దీవుల సముదాయమైన ఇండోనేషియాను మరోసారి సునామీ అతలాకుతలం చేసింది. శనివారం అర్థరాత్రి సముద్ర గర్భంలో సంభవించిన భూకంపం సముద్రాన్ని అల్లకల్లోలంగా మార్చి తీర ప్రాంతాలను ముంచెత్తింది. ఈ సునామీ దాటికి దాదాపు 62 మంది మృతిచెందగా, మరో 600 మంది వరకు తీవ్ర గాయాలపాలైనట్లు ఇండోనేషియా విపత్తు నివారణ అధికారులు వెల్లడించారు. 

తరచూ భూకంపాల భారిన పడే  ఇండోనేషియాలో అప్పుడప్పుడు సముద్ర గర్భంలో కూడా భూకంపాలు సంభవిస్తుంటాయి. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారి రాకాసి అలలతో తీర ప్రాంతాలను ముంచెత్తుతుంది. ఇలా గతంలో కూడా చాలాసార్లు ఇండోనేషియాలో భారీ సునామీలు సంభవించాయి. 

తాజా సునామీ ఇండోనేషియాలోని పండేగ్లాంగ్, సెరాంగ్‌, దక్షిణ లాంపంగ్‌ ప్రాంతాలపై తన ప్రతాపాన్ని చూపింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు దక్షిణ సుమత్రా, పశ్చిమ జావా దీవుల్లో సునామీ వచ్చినట్లు అధికారులు తెలిపారు. సునామీ కారణంగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలుతీర ప్రాంతంలోని వందలాది భవనాలు తీవ్రంగా దెబ్బతీశాయి. 

ఈ అలల దాటికి కొంతమంది సముద్రంలో గల్లంతయ్యారని సహాయక చర్యులు చేపడుతున్న అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య  మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. సునామీ దాటికి గురైన ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

Modi Trump: 16 నెల‌ల త‌ర్వాత తొలిసారి క‌లిసిన మోదీ, ట్రంప్‌.. అంతా సెట్ అయిన‌ట్లేనా.?
Richest Person: ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. 174 దేశాల జీడీపీ కంటే ఎక్కువ సంపద