బ్రిటీష్ కోర్టులో నీరవ్ మోదీ అప్పగింతపై స్పందించిన భారత్.. 

Published : Dec 07, 2022, 01:13 PM IST
బ్రిటీష్ కోర్టులో నీరవ్ మోదీ అప్పగింతపై స్పందించిన భారత్.. 

సారాంశం

తనను భారతదేశానికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నీరవ్ మోడీ దాఖాలు చేసిన పిటిషన్ పై  భారత్ స్పందించింది. లండన్‌ హైకోర్టులో విచారణ జరుగుతోన్న ఈ పిటిషన్ పై భారత ప్రభుత్వం తరపున హాజరైన క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (CPS)  స్పందించింది. నీరవ్  మోడీ 2 బిలియన్ల డాలర్ల  పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లోన్ స్కామ్ కేసులో అభియోగాలను ఎదుర్కొంటారు.

నీరవ్ మోదీ అప్పగింత కేసు: తనను భారతదేశానికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ దాఖాలు చేసిన పిటిషన్ పై భారత ప్రభుత్వం స్పందించింది. బ్రిటీష్ సుప్రీంకోర్టు లో దాఖాలైన పిటిషన్‌పై భారత్ తరపున హాజరయ్యే క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (CPS) సోమవారం సమాధానమిచ్చింది. 2 బిలియన్ డాలర్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం కేసులో అభియోగాలను ఎదుర్కొనేందుకు నీరవ్ మోడీ అప్పీల్ ను స్వీకరించడాన్ని CPS అభ్యంతరం వ్యక్తం చేసింది. 

నీరవ్ మోదీ అప్పీలు 

మానసిక ఆరోగ్య కారణాలపై హైకోర్టులో తొలి అప్పీల్‌లో ఓడిపోవడంతో నీరవ్ మోదీ తరపు న్యాయవాదులు గత నెలలో అప్పీలు దాఖలు చేశారు. అతడిని భారత్ కు అప్పగించడానికి తీవ్రంగా వ్యతిరేకించారు. అతడిని లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలు నుండి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలించడం అన్యాయం లేదా అణచివేత అని  ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ పేర్కొంది. "మేము డిసెంబర్ 5 న విచారణకు హాజరయ్యాం, లండన్‌లోని హైకోర్టు విచారణ లేకుండానే "పత్రాలపై" అప్పీల్ చేయడానికి అనుమతి ఇవ్వాలా వద్దా అనే దానిపై కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియకు కొన్ని వారాలు పట్టే అవకాశం ఉందని, ఈ ఏడాది పూర్తయ్యే అవకాశం లేదని భావిస్తున్నారు. "వారు ఆ ప్రశ్నను ధృవీకరించడానికి నిరాకరించి, అప్పీల్ చేయడానికి వదిలివేస్తే.. నీరవ్ తరలింపు సులభతరమవుతుంది." అని CPS పేర్కొంది.

నవంబర్ 9న లండన్‌లోని రాయల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో అప్పీల్‌కు విచారించిన లార్డ్ జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్ , జస్టిస్ రాబర్ట్ జే ధర్మాసనం.. మోదీ మానసిక పరిస్థితి, ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉంది. అతడిని లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలు నుండి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలించడం అన్యాయం లేదా అణచివేత అని  పేర్కొంది. 2019 మార్చిలో అప్పగింత వారెంట్‌పై అరెస్టు చేసినప్పటి నుండి జైలులో ఉన్న నీరవ్ మోడీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో గత నెలలో హైకోర్టు అప్పీల్‌ను కొట్టివేయడం పెద్ద విజయాన్ని సాధించింది. భారతదేశంలో వజ్రాల వ్యాపారికి వ్యతిరేకంగా మూడు సెట్ల క్రిమినల్ ప్రొసీడింగ్‌లు ఉన్నాయి.

2021లో అప్పగించేందుకు యూకే ప్రభుత్వం  అనుమతి 

బ్రిటన్ అప్పటి హోం మంత్రి ప్రీతి పటేల్ కోర్టు నిర్ణయం ఆధారంగా ఏప్రిల్ 2021లో మోడీని అప్పగించాలని ఆదేశించారు. ఇప్పుడు ఈ విషయం అప్పీళ్ల ప్రక్రియ ద్వారా జరుగుతోంది. దీనికి చాలా సమయం పట్టే అవకాశముంది.  ఈ సంవత్సరం కూడా వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే