India Pakistan conflict: పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ.. బలూచిస్తాన్ స్వాతంత్య్ర డిక్లరేషన్

Published : May 14, 2025, 05:53 PM IST
India Pakistan conflict: పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ..  బలూచిస్తాన్ స్వాతంత్య్ర డిక్లరేషన్

సారాంశం

India Pakistan conflict: పాకిస్తాన్ కు మరో దెబ్బ తగిలింది. బలూచిస్తాన్ నాయకులు పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ కు స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. ఇప్పుడు ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్’ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

India Pakistan conflict: పాకిస్తాన్ పై భారత్ ఇప్పటికే అనేక కఠిన చర్యలు తీసుకుంది. ఆపరేషన్ సింధూర్ దెబ్బతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్ కు ఇప్పుడు మరో షాక్ తగిలింది. చాలా కాలం నుంచి బలూచిస్తాన్ లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పాక్ సర్కారుకు అక్కడి నాయకులు ఇప్పుడు మరో షాక్ ఇచ్చారు. బలూచిస్తాన్ కు స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. బలూచ్ నాయకులు, కార్యకర్త మీర్ యార్ బలూచ్ సహా అక్కడి వారు పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ స్వాతంత్య్రం ప్రకటించిన తర్వాత ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్’ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇటీవలి సరిహద్దు దాటిన సైనిక చర్యల నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇదే సమయంలో బలూచ్ హక్కుల కోసం పోరాడే రచయిత, న్యాయవాదిగా పేరున్న మీర్ యార్ బలూచ్, X ప్లాట్‌ఫారమ్‌లో వరుస పోస్టుల ద్వారా ఈ ప్రకటన చేశారు. 

భారత ప్రభుత్వం న్యూఢిల్లీలో బలూచ్ రాయబార కార్యాలయాన్ని అనుమతించాలనీ, పాకిస్తాన్ సైన్యం ఈ ప్రాంతం నుండి వైదొలగాలని కోరుతూ, బలూచిస్తాన్‌కు శాంతి పరిరక్షక దళాలను పంపాలని ఐక్యరాజ్యసమితిని ఆయన కోరారు.

మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ ప్రకటన వెలువడింది.

 

 

 

మేము మా స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాం: బలూచిస్తాన్ నాయకులు

100 కి పైగా గ్యాస్ బావులు ఉన్న డెరా బుగ్టిలోని పాకిస్తాన్ గ్యాస్ ఫీల్డ్‌లపై బలూచ్ స్వాతంత్య్ర సమరయోధులు దాడి చేశారని మీర్ యార్ బలూచ్ పేర్కొన్నారు.

ఆయన తన ఒక పోస్ట్‌లో, “ఉగ్రవాద పాకిస్తాన్ పతనం దగ్గర పడింది కాబట్టి త్వరలోనే ప్రకటన చేయాలి. మేము మా స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాం, బలూచిస్తాన్ అధికారిక కార్యాలయం, ఢిల్లీలో రాయబార కార్యాలయాన్ని అనుమతించాలని భారతదేశాన్ని కోరుతున్నాం” అని అన్నారు.

అంతర్జాతీయ సమాజానికి కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. "డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ స్వాతంత్య్రాన్ని గుర్తించాలనీ, గుర్తింపు కోసం మద్దతు ఇవ్వడానికి అన్ని UN సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మేము ఐక్యరాజ్యసమితిని కోరుతున్నాం. "కరెన్సీ, పాస్‌పోర్ట్ ప్రింటింగ్ కోసం బిలియన్ల నిధులను విడుదల చేయాలి" అని ఆయన అన్నారు.

 

 

 

 

పాకిస్తాన్ సైన్యంపై దాడి చేసినట్లు ప్రకటించిన BLA

పాకిస్తాన్ సైనిక సిబ్బందిని తీసుకెళ్తున్న ఉపయోగకర వాహనం ధ్వంసం అయినట్లు చూపించే వీడియో కూడా ఆన్‌లైన్‌లో వచ్చింది. ఈ పేలుడుకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) బాధ్యత వహించింది, 14 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని తెలిపింది.

పాకిస్తాన్‌లోని అనేక జిల్లాల్లో ఏడు వరుస దాడులకు BLA బాధ్యత వహించింది. ఈ దాడులు 'ఆపరేషన్ హెరోఫ్ 2.0' అనే ప్రచారంలో భాగమనీ, 58 ప్రదేశాలలో మొత్తం 78 ఆపరేషన్లు నిర్వహించినట్లు తిరుగుబాటుదారుల బృందం పేర్కొంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే