కన్నతల్లి కళ్ల ముందే ఓ టాక్సీ డ్రైవర్ ఆమె ఆరేళ్ల కొడుకుపై గాజు ముక్కతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆ బాలుడి తల ఎగిరిపడింది. తన కొడుకును కాపాడుకొనేందుకు ఆ తల్లి చేసిన ప్రయత్నం వృధాగా మారింది.
మదీనా: కన్నతల్లి కళ్ల ముందే ఓ టాక్సీ డ్రైవర్ ఆమె ఆరేళ్ల కొడుకుపై గాజు ముక్కతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆ బాలుడి తల ఎగిరిపడింది. తన కొడుకును కాపాడుకొనేందుకు ఆ తల్లి చేసిన ప్రయత్నం వృధాగా మారింది. ఈ ఘటన మదీనాకు సమీపంలో చోటు చేసుకొంది.
ఓ తల్లి తన ఆరేళ్ల కొడుకు జకారియాతో కలిసి టాక్సీలో మహ్మద్ ప్రవక్త పవిత్ర క్షేత్రం మదీనాకు బయలు దేరింది. అయితే టాక్సీ డ్రైవర్ మద్యలోనే కారును ఆపి కారులో కూర్చొన్న ఆరేళ్ల బాలుడిని బలవంతంగా బయటకు లాగి గాజు ముక్కతో ఆ బాలుడిపై దాడి చేశారు.
ఈ దాడిలో ఆ బాలుడి తల అక్కడికక్కడే తెగిపడింది.అయితే తన కొడుకును కాపాడుకొనేందుకు ఆమె శతవిధాలా ప్రయత్నాలు చేసింది. కానీ, ఆమె తన కొడుకును కాపాడుకోలేకపోయింది.
శుక్రవారం నాడు మదీనాలో ఈ ఘటన చోటు చేసుకొన్నట్టుగా మీడియా ప్రకటించింది. టాక్సీ డ్రైవర్ నుండి బాలుడిని రక్షించేందుకు కూడ పోలీసులు అక్కడికి చేరుకొనేలోపుగా నిందితుడు ఆ బాలుడిని చంపేశాడు. ఇదిలా ఉంటే టాక్సీ డ్రైవర్ మానసిక సమస్యతో బాధపడుతున్నట్టుగా చెబుతున్నారు. నిందితుడిని అదుపులోకి పోలీసులు ప్రశ్నిస్తున్నారు.