అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగుర్ని చంపిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హతం..

Google News Follow Us

సారాంశం

అమెరికాలోని అట్లాంటా సమీపంలో వారాంతంలో నలుగురి హత్య కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అధికారులు కాల్చి చంపారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఇద్దరూ పోలీసు అధికారి గాయపడ్డారు

అమెరికాలోని జార్జియాలో కాల్పుల కలకలం చెలారేగింది. నలుగురు వ్యక్తులను ఎన్‌కౌంటర్‌లో హత్య చేసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను  పోలీసులు హతమార్చారు. ఎన్‌కౌంటర్‌లో  షెరీఫ్ డిప్యూటీ , ఒక పోలీసు అధికారి  గాయపడ్డారని అధికారి తెలిపారు. ఈ ఘటనపై హెన్రీ కౌంటీ షెరీఫ్ అధికార ప్రతినిధి సింటోనియా మూర్ మాట్లాడుతూ.. దర్యాప్తు సమయంలో అనుమానితుడు ఆండ్రీ లాంగ్‌మోర్‌పై కాల్పులు జరిపినట్లు తెలిపారు. జార్జియా ప్రధాన నగరానికి దక్షిణంగా ఉన్న హాంప్టన్ యొక్క ఉపవిభాగంలో శనివారం ఉదయం కాల్పుల కలకలం చోటుచేసుకుంది.

ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు.  క్లేటన్ కౌంటీలోని సమీప ప్రాంతంలో నిందితుడు లాంగ్‌మోర్‌ను లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కాల్చిచంపారని మూర్ చెప్పారు. లాంగ్‌మోర్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు హెన్రీ కౌంటీ షెరీఫ్ డిప్యూటీ , క్లేటన్ కౌంటీ పోలీసు అధికారి గాయపడ్డారని మూర్ చెప్పారు. అట్లాంటా శివార్లలోని హాంప్టన్‌లో అనేక మందిని కాల్చిచంపినట్లు లాంగ్‌మోర్‌పై ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసుల్లో అతడు వాంటెడ్ గా ఉన్నాడు. నలుగురి హత్యకేసులో అతని కోసం పోలీసులు  గాలిస్తున్నారు.

ఈ కాల్పుల్లో నలుగురు హతం 

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాకు దక్షిణంగా ఉన్న ఒక చిన్న కమ్యూనిటీలో జరిగిన సామూహిక కాల్పుల్లో కనీసం నలుగురు వ్యక్తులు మరణించారు. అట్లాంటాకు దక్షిణాన 40 మైళ్ల దూరంలో ఉన్న హాంప్టన్‌లో శనివారం ఉదయం పోలీసు సంఘటన జరిగిందని హెన్రీ కౌంటీ అధికారి పేర్కొన్నారు.