ఫ్రాన్స్ : ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు.. రంగంలోకి బాంబ్ స్క్వాడ్, పర్యాటకులను ఖాళీ చేయిస్తున్న అధికారులు

Siva Kodati |  
Published : Aug 12, 2023, 07:36 PM IST
ఫ్రాన్స్ : ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు.. రంగంలోకి బాంబ్ స్క్వాడ్, పర్యాటకులను ఖాళీ చేయిస్తున్న అధికారులు

సారాంశం

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో వున్న ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు వచ్చింది.  స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు టవర్ నుంచి పర్యాటకులను క్లియర్ చేసినట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి.

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో వున్న ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది ఈఫిల్ టవర్ వద్ద పర్యాటకులను ఖాళీ చేయించి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. టవర్‌తో పాటు దాని చుట్టు పక్కల వున్న దుకాణాలను మూయించి, ఆ ప్రాంతం నుంచి అందరినీ వెనక్కి పంపిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు టవర్ నుంచి పర్యాటకులను క్లియర్ చేసినట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 


 

PREV
click me!

Recommended Stories

India Vs China: చైనాకు చుక్కలు చూపించే సత్తా ఉన్న ఏకైక దేశం.. భారత్ పవర్ పై అమెరికా మైండ్ బ్లోయింగ్ స్టేట్‌మెంట్ !
Europe Heatwave: అగ్నిగుండంగా మారిన యూరప్.. వేడికి తట్టుకోలేక రోడ్డుపైనే జనం..