దుబాయ్ రాజుగారిని వదిలి వెళ్లిపోయిన రాణి: రూ.270కోట్లతో పరార్

Siva Kodati |  
Published : Jul 01, 2019, 10:19 AM IST
దుబాయ్ రాజుగారిని వదిలి వెళ్లిపోయిన రాణి: రూ.270కోట్లతో పరార్

సారాంశం

దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముఖ్తామ్.. ఆరో భార్య, జోర్డాన్ రాజుకు సవతి సోదరి అయిన హయా బింత్ అల్ హుస్సేన్ రూ.270 కోట్లకుపైగా సంపదతో పాటు తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది.

భర్తను వదిలిపెట్టి భార్య వెళ్లిపోవడం సామాన్యుల విషయాల్లో జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఏకంగా దేశాధినేతల విషయంలో జరిగితే.. అది కూడా కఠిన చట్టాలు ఉండే ముస్లిం దేశాల్లో జరిగితే..

దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముఖ్తామ్.. ఆరో భార్య, జోర్డాన్ రాజుకు సవతి సోదరి అయిన హయా బింత్ అల్ హుస్సేన్ రూ.270 కోట్లకుపైగా సంపదతో పాటు తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది.

కొద్దికాలం క్రితం మొహమ్మద్ బిన్‌ను నుంచి హయా విడాకులు కోరింది. దుబాయ్‌లో తనకు ప్రాణహానీ ఉందని భావించి తనకు ఆశ్రయం కావాలంటూ జర్మనీని కోరినట్లు   తెలుస్తోంది.

తర్వాత ఓ జర్మనీ దౌత్యవేత్త సాయంతో మొదట జర్మనీకి వెళ్లిపోయిందని రాజు కుటుంబసభ్యులు భావిస్తున్నారు. అయితే ఆక్స్‌ఫర్డ్ చదువుకున్న హయా.. లండన్‌కు వెళ్లిపోయి ఉండొచ్చని రాజకుటుంబానికి సన్నిహితులు తెలిపినట్లుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ