జాతి వివక్ష పోరాట యోధుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్ టుటు అస్తమయం...

Published : Dec 27, 2021, 07:46 AM IST
జాతి వివక్ష పోరాట యోధుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్ టుటు అస్తమయం...

సారాంశం

ఆదివారం వేకువజామున కేప్ టౌన్ లోని ఓ ఆసుపత్రిలో కన్ను మూశారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ప్రకటించారు.  గతంలో క్షయ వ్యాధికి గురైన డెస్మండ్ టుటు, Prostate cancer బారిన పడి 1997లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత పలు అనారోగ్య సమస్యలు ఆయనను చుట్టుముట్టాయి. 

జొహన్నెస్ బర్గ్  :  South Africaలో జాతి వివక్షపై అవిశ్రాంత పోరాటం సాగించిన హక్కుల నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత Desmond Tutu (90) అస్తమించారు. ఆదివారం వేకువజామున కేప్ టౌన్ లోని ఓ ఆసుపత్రిలో కన్ను మూశారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ప్రకటించారు.  గతంలో క్షయ వ్యాధికి గురైన డెస్మండ్ టుటు, Prostate cancer బారిన పడి 1997లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. 

ఆ తర్వాత పలు అనారోగ్య సమస్యలు ఆయనను చుట్టుముట్టాయి. బ్రిటీషర్ల హయాంలో నల్లజాతి ప్రజల హక్కుల కోసం, అన్యాయాలకు గురైన వారి తరఫున డెస్మండ్ టుటు తీవ్రంగా పోరాడారు. నల్లజాతీయుల పాలన మొదలైన తర్వాత కూడా అన్యాయాలను, అక్రమాలను ఖండించడంలో ఆయన వెనుక వెనుకాడలేదు.

World Inequality Report: అస‌మాన భార‌త్.. పెరుగుతున్న అంత‌రాలు !

అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్లో కొనసాగుతూనే పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ సంస్థలను కొల్లగొడుతున్న తీరుపై గళమెత్తారు. Archbishop టుటు మృతి భారత ప్రధాని నరేంద్రమోడీ పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆర్చి బిషప్ టుటును ‘ఆఫ్రికా పీస్ బిషప్’ గా నోబెల్ ఇన్స్టిట్యూట్ అభివర్ణించింది. దక్షిణాఫ్రికా నల్లజాతి ప్రజలపై బ్రిటిషర్లు దారుణాలకు పాల్పడినప్పటికీ బిషప్ టుటు మాత్రం అహింసాయుత విధానాలకే కట్టుబడి ఉన్నారని కొనియాడింది.

మండేలాతో విడదీయరాని మైత్రి...
మొదట జోహన్నెస్బర్గ్ గా ఉన్న టుటు తర్వాత కెప టౌన్ బిషప్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవులు నిర్వహిస్తూనే స్థానిక నల్లజాతీయులపై శ్వేతజాతీయుల దురాగతాలను ఖండించడంలో వెనకాడలేదు.  జొహన్నెస్ బర్గ్ ఆర్చ్ బిషప్ గా కొనసాగుతున్న సమయంలోనే 1984లో ఆయనకు నోబెల్  శాంతి బహుమతి వరించింది. బ్రిటిషర్ల హయాంలో జాతి వివక్షకు గురైన వారికి న్యాయం చేసే లక్ష్యంతో 1995లో నేతృత్వంలో ‘ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్’ ను మండేలా నియమించారు.  టుటు, మండేలా మధ్య అనుబంధాన్ని వివరిస్తూ మండేలా ఫౌండేషన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Libya: సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన 27 మృతదేహాలు..

‘1950లో పాఠశాలలో చదువుకునే రోజుల్లో జరిగిన వకృత్వం పోటీల సమయంలో మండేలా, టుటు తొలిసారి కలుసుకున్నారు. ఇద్దరూ జాతి వివక్షపై ప్రజల తరఫున పోరాటం సాగించారు. ఇది నచ్చని బ్రిటిషర్లు వారిద్దరూ కలుసుకోకుండా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పలు అవాంతరాలు కల్పించారు. చివరికి మండేలా 27 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపి విడుదలయ్యాకే టుటుతో నేరుగా మాట్లాడగలిగారు. చెరసా నుంచి విడుదలైన మండేలా మొదటగా వెళ్లి ఆరోజు గడిపింది టుటు నివాసంలోనే’ అని తెలిపింది. మండేలా 2013లో తుదిశ్వాస విడిచే వరకు టుటుతో అనునిత్యం మాట్లాడుకుంటూనే ఉన్నారంటూ వారి మధ్య ఉన్న గాఢమైత్రిని గుర్తు చేసింది .

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?