నేపాల్ లో కుప్పకూలిన హెలికాప్టర్...ఏడుగురు గల్లంతు

Published : Sep 08, 2018, 04:09 PM ISTUpdated : Sep 09, 2018, 02:14 PM IST
నేపాల్ లో కుప్పకూలిన హెలికాప్టర్...ఏడుగురు గల్లంతు

సారాంశం

నేపాల్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులను తరలిస్తున్న ఓ హెలికాప్టర్ ప్రతికూల పరిస్థితుల కారణంగా ప్రమాదానికి గురయ్యింది. ఆ దుర్ఘటనలో ఓ విదేశీ పర్యాటకుడితో పాటు మరో ఆరుగురు గల్లంతయ్యారు.   

నేపాల్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులను తరలిస్తున్న ఓ హెలికాప్టర్ ప్రతికూల పరిస్థితుల కారణంగా ప్రమాదానికి గురయ్యింది. ఆ దుర్ఘటనలో ఓ విదేశీ పర్యాటకుడితో పాటు మరో ఆరుగురు గల్లంతయ్యారు. 

ఇవాళ గోర్ఖా జిల్లా నుండి ఓ ఆరుగురు ప్రయాణికులతో అల్టిట్యూడ్ సంస్థకు చెందిన ఓ హెలికాప్టర్ బయలుదేరింది. కొద్దిసేపటికే ఎయిర్ ట్రాపిక్ కంట్రోల్ తో ఈ హెలికాప్టర్ సంబంధాలు తెలగిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు గాలింపు చేపట్టగా దండిల్ ప్రాంతంలోని హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. కొండ ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం కారణంగా విమానం కుప్పకూలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 

ఈ ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో పైలట్ తో పాటు ఆరుగురు ప్రయాణికులు వున్నట్లు ఖాట్మండూ ఎయిర్ పోర్టు జనరల్ మేనేజర్ రాజ్‌కుమార్ తెలిపారు. ఓ విదేశీ పర్వతారోహికుడితో పాటు ఐదుగురు సాధారణ ప్రయాణికులు ఓ పైలట్ గల్లంతయ్యారని ఆయన తెలిపాడు. ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని ఆయన వెల్లడించారు.
 

PREV
click me!

Recommended Stories

US-Iran War :ఈ రాత్రికి అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బాంబు దాడి..? అసలు నిజమేంటి..?
Iran Israel War లోకి ఇండియా ఇండైరెక్ట్ ఎంట్రీ..? ట్రంప్ కు స్ట్రాంగ్ వార్నింగ్..?