కరోనా దెబ్బకు కొండెక్కిన కోడి.. కిలో చికెన్ ధర రూ. వెయ్యి, ఒక గుడ్డు రూ.35...

Published : Mar 21, 2022, 10:51 AM IST
కరోనా దెబ్బకు కొండెక్కిన కోడి.. కిలో చికెన్ ధర రూ. వెయ్యి, ఒక గుడ్డు రూ.35...

సారాంశం

అక్కడ కిలో చికెన్ ధర వెయ్యి రూపాయలు.. ఒక్క కోడిగుడ్డు కొనాలంటే.. రూ.35 చెల్లించాలి.. ఇక కిలో ఉల్లిపాయల ధర బియ్యంకంటే ఎక్కువే.. వంట గ్యాస్ లేదు.. కరెంట్ కోత.. నిత్యావసరాలు కావాలన్నా, పెట్రోల్ కావాలన్నా గంటల తరబడి క్యూలో నిలబడాలి.. ఇంతకీ ఇది ఎక్కడంటే...

శ్రీలంక : మామూలుగా కిలో చికెన్ ధర.. 200 నుంచి 350..400 మధ్యలో షఫిల్ అవుతూ ఉంటుంది. డిమాండ్ తగ్గినప్పుడు తగ్గే ధరలు.. పెరిగిన సమయంలో కాస్త పెరుగుతూ.. ఊరిస్తాయి. కానీ ఏకంగా కిలో చికెన్ వెయ్యిరూపాయలవ్వడం పెద్ద షాకింగ్ విషయమే. ఇలా అయితే చికెన్ బిర్యానీ తినాలంటే ఆస్తులమ్ముకోవడమే.. అనుకుంటున్నారా? ఇది శ్రీలంకలో ఇప్పుడున్న దయనీయ పరిస్థితికి అద్దం పట్టే ఒక్క విషయం మాత్రమే.

చికెన్ తోపాటు, కోడిగుడ్లు, ఉల్లిపాయలు, బియ్యం.. ఇలాంటి నిత్యావసరాలన్నీ కొండెక్కాయి. సామాన్యుడిని కడుబీదవాడిగా.. ధనవంతుడిని సామాన్యుడిగా మారుస్తూ తీవ్ర సంక్షోభానికి దారి తీస్తున్నాయి ఈ పరిస్తితులు. 

కరోనా దెబ్బకు అన్ని దేశాలతో పాటు Sri Lanka కూడా lock downలోకి వెళ్ళింది. ఫలితంగా అక్కడి ప్రధాన పరిశ్రమలు టీ, వస్త్రాలు, పర్యాటకం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆదాయం లేక దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. సెంట్రల్ బ్యాంకు దగ్గర ఉన్న విదేశీ మారక ద్రవ్య విలువలు పడిపోయాయి. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి చేరింది. ఈ కారణంగా విదేశీ మారక ధరలు పెరిగాయి. తాజాగా శ్రీలంకన్ కరెన్సీలో 230 రూపాయలుగా ఉన్న యూఎస్ డాలర్ విలువ 270కి పెరిగింది.  దీంతో, శ్రీలంకలో వస్తువులు, ధరలు ఊహించని రీతిలో పెరిగాయి.  

పరిస్థితి అదుపు లేకుండా పోయింది. నిత్యావసర వస్తువుల ధరలన్నీ రెట్టింపయ్యాయి. వంట గ్యాస్ కొరతతో చాలా హోటళ్లు మూతపడ్డాయి. నిత్యావసరాల కోసం ప్రజలు క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది. కేజీ చికెన్ వెయ్యి రూపాయలు, ఒక్కో గుడ్డు 35 రూపాయలు, కిలో ఉల్లిపాయలు 250రూపాయలు, బియ్యం  రెండు వందల రూపాయలు అయ్యాయి. పెట్రోల్ బంకుల వద్ద వేల వాహనాలు బారులు తీరుతున్నాయి. 1970లలో సిరిమావో బండారు నాయకే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు శ్రీలంకలో కరువు ఏర్పడిందని చెబుతారు. ప్రస్తుతమున్న సంక్షోభం దాని కంటే దారుణంగా ఉందని చాలామంది అంటున్నారు. ఈ పరిస్థితుల వల్ల పేద వారి నుంచి ధనికుల వరకు అందరూ ప్రభావితులవుతున్నారు.

90 శాతం రెస్టారెంట్లు, హోటల్లు  మూతపడ్డాయి.  కర్రల పొయ్యి మీద వంట చేసే కొన్ని చిన్నచిన్న రెస్టారెంట్లు మాత్రం నడుస్తున్నాయి. శ్రీలంకకు గ్యాస్ సరఫరా చేసే letro గ్యాస్, లాఫ్స్ గ్యాస్ తాత్కాలికంగా సరఫరాను నిలిపివేశాయి. ఈ ఆర్థిక సంక్షోభం నడుమ, శ్రీలంకలో తీవ్రమైన విద్యుత్ కోత కొనసాగుతోంది. ప్రతిరోజూ గంటల పాటు కరెంటు సరఫరా ఉండటం లేదు. దీంతో వాణిజ్య కేంద్రాలు, దుకాణాలు, పరిశ్రమలు ప్రభావితం అవుతున్నాయి. కరెంటు లేనప్పుడు  జనరేటర్లను వాడడం సాధారణమే కానీ, డీజిల్ కొరత వల్ల అలా వాడే అవకాశం ఉండడం లేదు.

PREV
click me!

Recommended Stories

Most Dangerous Lake : ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సరస్సు.. దిగితే ప్రాణాలు పోవడం ఖాయం!
World Coldest Place : ఫ్రిజ్‌లో ఉన్నట్టే.. ప్రపంచంలోనే అత్యంత కూలెస్ట్ ప్లేస్ ఇదే గురూ !