కెనడా ఇండియన్ రెస్టారెంట్ లో పేలుడు

Published : May 25, 2018, 11:00 AM IST
కెనడా ఇండియన్ రెస్టారెంట్ లో పేలుడు

సారాంశం

కెనడాలోని టోరంటో శివారులోని మిస్సిసౌగా ప్రాంతంలోని ఓ ఇండియన్ రెస్టారెంట్లో పేలుడు సంభవించింది.

టోరంటో: కెనడాలోని టోరంటో శివారులోని మిస్సిసౌగా ప్రాంతంలోని ఓ ఇండియన్ రెస్టారెంట్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో దాదాపు 15 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వార్తలను బట్టి తెలుస్తోంది.

బొంబాయి భేల్ రెస్టారెంట్ పేలుడు ఘటనలో గాయపడిన 15మందిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ మేరకు పీల్ రీజినల్ పారామెడిక్ సర్వీస్ ట్వీట్ చేసింది.

పేలుడు గురువారం రాత్రి 10.30 గంటలకు సంభవించింది. దానికి కారణం ఏమిటనేది తెలియదు. సంఘటన జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయినట్లు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Neal Katyal : ట్రంప్ కే చుక్కలు చూపిస్తున్న భారత సంతతి లాయర్.. ఎవరీ నీల్ కత్యాల్..?
US Tariffs : ట్రంప్ టారీఫ్స్ కు సుప్రీం బ్రేక్ .. అమెరికా అధ్యక్షుడి పవర్ ఈ చట్టంముందు తుస్సుమందిగా..!