అదానీ, సెలెబి ఒప్పందం రద్దు

Bhavana ThotaANI | Published : May 16, 2025 5:22 AM

ముంబై, అహ్మదాబాద్ విమానాశ్రయాలకు గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించే ఒప్పందాన్ని అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ రద్దు చేసింది. 

ముంబై (మహారాష్ట్ర): అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ ముంబై, అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో టర్కీకి చెందిన సెలెబి కంపెనీతో ఉన్న గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఒప్పందాలను రద్దు చేసింది. ఇందుకు కారణంగా భారత ప్రభుత్వం జారీ చేసిన భద్రతా అనుమతిని సెలెబి సంస్థకు రద్దు చేయడం అని స్పష్టమైంది.

ప్రభుత్వం నుంచి భద్రతా అనుమతి నిలిపివేయబడ్డ తర్వాత, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్‌పోర్ట్ (CSMIA),  అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్‌పోర్ట్ (SVPIA) ల్లో సెలెబితో ఉన్న ఒప్పందాలను పూర్తిగా ముగించామని ఎయిర్‌పోర్ట్ అధికార ప్రతినిధులు ప్రకటించారు. ఈ నిర్ణయం అనంతరం విమానాశ్రయాల కార్యకలాపాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు సెలెబి నుంచి సేవలను వెంటనే తీసివేసి కొత్త ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించారు.

ప్రస్తుతం ఎంపిక చేసిన కొత్త గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థల ద్వారా అన్ని విమానాలకూ ఎటువంటి ఆటంకం లేకుండా సేవలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. అంతేకాక, సెలెబి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను వారి ఉద్యోగ నిబంధనల ప్రకారం కొత్త ఏజెన్సీలకు బదిలీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో ఎవరి ఉద్యోగ భద్రతకు హాని లేదని చెప్పారు.ఇక సోషల్ మీడియాలో సెలెబి సంస్థపై ప్రచారమవుతున్న ఆరోపణలపై స్పందిస్తూ, తమ యాజమాన్య నిర్మాణం మరియు కంపెనీ కార్యకలాపాలు పూర్తిగా పారదర్శకంగా ఉన్నాయని సెలెబి సంస్థ ప్రకటించింది. ఇది కేవలం టర్కీలో మాత్రమే కాక, కెనడా, అమెరికా, యూకే, సింగపూర్, యూఏఈ సహా పలు దేశాల్లో సేవలందిస్తున్న గ్లోబల్ కంపెనీ అని పేర్కొంది.

1958లో స్థాపితమైన ఈ సంస్థ కార్గో, ర్యాంప్ సేవలు, ప్రయాణికుల హ్యాండ్లింగ్, లోడ్ కంట్రోల్, విమానాల శుభ్రత వంటి అనేక విభాగాల్లో సేవలందిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీలో 65 శాతం వాటా అంతర్జాతీయ పెట్టుబడిదారుల వద్ద ఉండగా, మిగిలిన వాటా జెర్సీ మరియు నెదర్లాండ్స్‌లోని సంస్థల యాజమాన్యంలో ఉంది.సంస్థపై వచ్చిన భద్రతా అనుమతుల రద్దుతో దేశీయ విమానాశ్రయాల్లో వినియోగదారుల సేవలపై ప్రభావం పడకుండా చూసేందుకు అదానీ గ్రూప్ ముందస్తు చర్యలు తీసుకోవడం గమనార్హం.

Read more Articles on
click me!