Earthquake : చైనాలో భారీ భూకంపం, 110 మంది మృతి...

Published : Dec 19, 2023, 06:37 AM ISTUpdated : Dec 19, 2023, 07:45 AM IST
Earthquake : చైనాలో భారీ భూకంపం, 110 మంది మృతి...

సారాంశం

భూకంపం ప్రభావంతో గన్సులో 86 మంది, దాని పొరుగున ఉన్న కింగ్‌హై ప్రావిన్స్‌లో మరో తొమ్మిది మంది మరణించారని జిన్హువా న్యూస్ ఏజెన్సీ నివేదించింది.

చైనా : వాయువ్య చైనాలోని గన్సు, కింగ్‌హై ప్రావిన్సులలో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపంలో కనీసం 95 మంది మరణించారని రాష్ట్ర వార్తా సంస్థ నివేదించింది. సోమవారం సాయంత్రం సంభవించిన భూకంపంలో గన్సు ప్రావిన్స్‌లో 86 మంది, పొరుగున ఉన్న కింగ్‌హై ప్రావిన్స్‌లో మరో తొమ్మిది మంది మరణించారని జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

భూకంపం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక ఇళ్లు కూలిపోయాయి. భయంకంపితులైన ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. బలమైన, లోతులేని భూకంపం సంభవించిన తర్వాత ప్రావిన్స్‌లో 200 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. జిన్హువా ప్రకారం, పొరుగు ప్రావిన్స్ కింగ్‌హైలోని హైడాంగ్ నగరంలో తొమ్మిది మంది మరణించారు. 124 మంది గాయపడ్డారు.

Dawood Ibrahim Net Worth: అండర్ వరల్డ్ డాన్ గురించి షాకింగ్ విషయాలు.. దావూద్ మొత్తం సంపాదన ఎంతో తెలుసా..?

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ భూకంపానికి సంబంధించి ముఖ్యమైన సూచనలను జారీ చేశారు. దీనిపై పూర్తి స్థాయి శోధన, రెస్క్యూ ప్రయత్నాలు, బాధితులకు సరైన పునరావాసం, పౌరుల జీవితాలు, ఆస్తుల భద్రతను నిర్ధారించడానికి గరిష్ట ప్రయత్నాలు చేయాలని ఆదేశించారని రాష్ట్ర మీడియా గ్లోబల్ టైమ్స్ నివేదించింది .

తీవ్ర నష్టం
భూకంపం కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక ఇళ్లు కూలిపోయాయి. హాఠాత్తుగా జరుగుతున్న ఈ భయానక వాతావరణాన్ని చూసి ప్రజలు వీధిలోకి పరుగులు తీశారు. సోమవారం రాత్రి ఘటన జరగడంతో మంగళవారం తెల్లవారుజామునుంచి సహాయక చర్యలు చేపట్టారు.

హైడాంగ్ ఉన్న కింగ్‌హై ప్రావిన్స్‌తో సరిహద్దుకు సమీపంలో ఉన్న గన్సు ప్రావిన్స్‌లో సంభవించిన ఈ భూకంప తీవ్రతను యుఎస్ జియోలాజికల్ సర్వే 5.9 తీవ్రతగా, జిన్హువా 6.2 తీవ్రతగా అంచనా వేసింది. దీని ప్రభావంతో కొన్ని స్థానిక గ్రామాలలో విద్యుత్, నీటి సరఫరాలకు అంతరాయం ఏర్పడిందని నివేదిక పేర్కొంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలలో పడిపోయిన పైకప్పులు, ఇతర శిధిలాలు కనిపించాయి.

చైనా భూకంప కేంద్రం
యూఎస్జీఎస్ ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11:59 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది, ఇది మొదట 6.0గా నివేదించారు. ఆ తర్వాత తీవ్రత తగ్గింది. వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. భూకంపం సంభవించిన వెంటనే ఆ ప్రాంతానికి రెస్క్యూ సిబ్బందిని పంపించారు. స్థానిక నాయకులు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. 

యూఎస్జీఎస్ ప్రకారం, భూకంపం గన్సు ప్రావిన్స్ రాజధాని లాన్‌జౌకి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో సంభవించింది. ఆ తరువాత అనేక చిన్న భూకంపాలు వచ్చాయి.  చైనాలో భూకంపాలు సర్వసాధారణం. ఆగస్టులో, తూర్పు చైనాలో 5.4 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది, 23 మంది గాయపడ్డారు. డజన్ల కొద్దీ భవనాలు కూలిపోయాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?