నేపాల్‌లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రత..

Published : Oct 22, 2023, 09:49 AM IST
 నేపాల్‌లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రత..

సారాంశం

నేపాల్‌లో మరోసారి భూకంపం వణికించింది. ఆదివారం ఉదయం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేపాల్ నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.

నేపాల్‌లో మరోసారి భూకంపం వణికించింది. ఆదివారం ఉదయం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేపాల్ నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. నేపాల్ రాజధాని ఖాట్మండుకు పశ్చిమాన 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధాడింగ్‌లో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. ఇక, భూకంపం 13 కి. మీ (8.1 మైళ్లు) లోతులో సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. ఈ భూకంపం ప్రభావంతో బాగ్మతి, గండకి ప్రావిన్సులలోని ఇతర జిల్లాలలో కూడా కుదుపు కనిపించింది.

మరోవైపు ఢిల్లీ-ఎన్‌సీఆర్ వరకు కూడా స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ఇక, నేపాల్‌లో భూకంపాలు సర్వసాధారణంగా మారాయి.  నేపాల్ ప్రభుత్వం పోస్ట్ డిజాస్టర్ నీడ్స్ అసెస్‌మెంట్ (పీడీఎన్‌ఏ) నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాలలో 11వ స్థానంలో ఉంది.

PREV
click me!

Recommended Stories

Neal Katyal : ట్రంప్ కే చుక్కలు చూపిస్తున్న భారత సంతతి లాయర్.. ఎవరీ నీల్ కత్యాల్..?
US Tariffs : ట్రంప్ టారీఫ్స్ కు సుప్రీం బ్రేక్ .. అమెరికా అధ్యక్షుడి పవర్ ఈ చట్టంముందు తుస్సుమందిగా..!