ఇండోనేషియాలో భారీ భూకంపం.. 35కి చేరిన మృతుల సంఖ్య

Siva Kodati |  
Published : Jan 15, 2021, 02:40 PM IST
ఇండోనేషియాలో భారీ భూకంపం.. 35కి చేరిన మృతుల సంఖ్య

సారాంశం

ఇండోనేషియాలో శుక్రవారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 35కి చేరినట్లు ఇండోనేషియా డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ ప్రకటించింది. తెల్లవారుజామున సులవేసి దీవిలో 6.2 తీవ్రతతో భూమి కంపించింది. 

ఇండోనేషియాలో శుక్రవారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 35కి చేరినట్లు ఇండోనేషియా డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ ప్రకటించింది. తెల్లవారుజామున సులవేసి దీవిలో 6.2 తీవ్రతతో భూమి కంపించింది.

ఈ ఘటనలో ఇప్పటివరకు 35 మంది చనిపోగా.. వందల సంఖ్యలో గాయపడ్డారు. భవన శిథిలాల కింది అనేక మంది చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.

స్థానిక కాలమానం ప్రకారం.. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత భూకంపం సంభవించింది. 6.2 తీవ్రతతో దాదాపు 7 సెకన్ల పాటు భూమి కంపించింది.  దీంతో జనం ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

భూకంపం ధాటికి కనీసం 62 భవనాలు కుప్పకూలినట్లు ఏజెన్సీ వెల్లడించింది. మజెనీ ప్రాంతంలో 637 మంది, మముజు ప్రాంతంలో 20 మందికి పైగా గాయపడ్డారు.

 ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూకంపం సంభవించడంతో చాలా మంది శిథిలాల కిందే చిక్కుకుపోయారు. 2018లో ఇదే సులవేసి దీవిలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి సునామీ వచ్చింది. ఆ ప్రకృతి విపత్తులో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.   

PREV
click me!

Recommended Stories

Summer Tour : మండుటెండల్లో చల్లచల్లని టూర్.. ఈ వేసవిలో తప్పక వెళ్లాల్సిన టాప్ 10 దేశాలు ఇవే..!
Smart Lockdown: మళ్లీ లాక్‌డౌన్! రాత్రి 8 గంటలకే అన్నీ బంద్.. అసలేం జరిగిందంటే.?