సౌదీ వైమానికదాడి: 31 మంది పౌరుల మృతి

Published : Feb 16, 2020, 07:25 AM IST
సౌదీ వైమానికదాడి: 31 మంది పౌరుల మృతి

సారాంశం

సౌదీ వైమానిక దాడిలో 31 మంది సాధారణ పౌరులు మృతి చెందారు. హౌతి తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకొని సౌదీ ఈ దాడికి దిగింది.


యెమన్: సౌదీ నేతృత్వంలోని దళాలు యెమెన్ పై విమానాలతో దాడికి దిగాయి. జెట్ విమానాన్ని కూల్చడంతో 31 మంది పౌరులు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి కూడ ఈ విషయాన్ని ధృవీకరించింది.

హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి చేశారు. ఈ ఘటన జరగడానికి ముందు రోజే యెమెన్ లో సౌదీకి చెందిన జెట్ విమానం కూలిపోయింది.

ఈ విమానాన్ని తామే కూల్చి వేసినట్టుగా హౌతి తిరుగుబాటుదారులు ప్రకటించారరు. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగాయని భావిస్తున్నారు. ఈ దాడుల  గురించి సౌదీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
 

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ