పాకిస్తాన్ లో విషాదం: పెషావర్‌ మసీదులో బాంబు పేలి 30 మంది మృతి

Published : Mar 04, 2022, 03:05 PM ISTUpdated : Mar 04, 2022, 03:33 PM IST
పాకిస్తాన్ లో విషాదం: పెషావర్‌ మసీదులో బాంబు పేలి 30 మంది మృతి

సారాంశం

పాకిస్తాన్ లో బాంబు పేలుడు చోటు చేసుకొంది.ఈ ఘటనలో 30 మంది మరణించారు. పెషావర్ రిసల్దార్ మసీదులో  బాంబు పేలిందని స్థానిక మీడియా ప్రకటించింది.


ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని Peshawar లోRisaldar  లో గల mosque లో శుక్రవారం నాుడ జరిగిన బాంబు పేలుడులో 30 మంది మరణించారు. ఈ మేరకు స్థానిక మీడియా ప్రకటించింది.

మసీదు వద్ద నమాజ్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చిన స.మయంలో ఈ పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో 30 మంది అక్కడికక్కడే మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

 ఈ విషయాన్ని స్థానిక పోలీస్ అధికారి వహీద్ ఖాన్ చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని  ఆసుపత్రికి తరలించారు. మసీదులో నమాజ్  చేసేందుకు తాను వెళ్తున్న సమయంలో భారీ శబ్దంతో పేలుడు చోటు చేసుకొందని షాయన్ హైదర్ అనే వ్యక్తి చెప్పారు. ఈ పేలుడు ధాటికి తాను మసీదు బయట పడ్డానని మీడియాకు తెలిపారు.  తాను ఈ ధాటికి స్పృహా కోల్పోయాయని ఆయన చెప్పారు. అయితే తాను స్పృహలోకి వచ్చిన తర్వాత తన చుట్టూ క్షతగాత్రులతో పాటు మృతదేహలు కన్పించాయని ఆయన వివరించారు. 

ఈ బాంబు దాడిని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే